రాజశేఖర్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌

సినీ నటుడు రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు

Updated : 31 Oct 2020 17:34 IST

హైదరాబాద్‌: సినీ నటుడు రాజశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఆయన ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

‘‘కరోనాతో బాధపడుతూ సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చేరిన డాక్టర్‌ వి.రాజశేఖర్‌ క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల చికిత్సకు స్పందిస్తున్నారు. ఐసీయూలో ఉన్న రాజశేఖర్‌కు నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నాం, ఎప్పటికప్పుడు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు’’ అని సిటీ న్యూరో సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్న కిశోర్ వెల్లడించారు.

కరోనా బారిన పడిన రాజశేఖర్‌ చికిత్స నిమిత్తం కొన్ని రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ప్లాస్మా థెరపీని కూడా చేశారు. తాజాగా రాజశేఖర్‌ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని