శ్రావణి ఆత్మహత్య..దేవరాజ్, సాయికృష్ణ అరెస్ట్
బుల్లితెర నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిర్మాత అశోక్రెడ్డినీ అరెస్ట్ చేస్తాం: వివరాలు వెల్లడించిన డీసీపీ
హైదరాబాద్: బుల్లితెర నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారిద్దర్నీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా గుర్తించామన్నారు. దేవరాజ్, సాయికృష్ణతో పాటు సినీ నిర్మాత అశోక్రెడ్డినీ నిందితుడిగా చేర్చామన్నారు. ఈ ముగ్గురూ శ్రావణిని ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటామని చెప్పారని.. ఆ తర్వాత పలు విధాలుగా ఆమెను వేధించారని తెలిపారు. ఈ బాధ భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని డీసీపీ వివరించారు.
ఎవరికి వారే శ్రావణిపై ఒత్తిడి తెచ్చారు..
‘‘శ్రావణి 2012లో హైదరాబాద్ వచ్చింది. 2015లో సాయికృష్ణారెడ్డితో, 2017లో నిర్మాత అశోక్రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2019లో దేవరాజ్ రెడ్డితో ఆమెకు పరిచయం అయింది. దేవరాజ్తో శ్రావణి దగ్గరవుతోందని సాయికృష్ణ ఆమె కుటుంబసభ్యులకు తరచూ ఫిర్యాదు చేసేవాడు. దీంతో శ్రావణిని తల్లిదండ్రులు కొంత ఇబ్బంది పెట్టారు. దేవరాజ్ కూడా పెళ్లి పేరుతో ఆమెను మోసం చేశాడు. అతడితో శ్రావణి మాట్లాడుతుండటంతో ఆమెపై సాయికృష్ణ దాడి చేశాడు. ఆత్మహత్యకు ముందు దేవరాజ్తో శ్రావణి చాలా సేపు మాట్లాడింది. అయితే ఆ సంభాషణలో ఎక్కడా అతడికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడలేదు. పెళ్లి చేసుకుంటానని గతంలో చెప్పినందున అతడి పాత్ర కూడా ఈ కేసులో ఉందని భావించి దేవరాజ్నూ అరెస్ట్ చేశాం. గతంలో శ్రావణి సైతం అతడిపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. దేవరాజ్, సాయికృష్ణ, అశోక్.. ముగ్గురూ ఎవరికి వారు తమతోనే ఉండాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎటూ తేల్చుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నాం. ఈ కేసులో ఏ1గా సాయికృష్ణ, ఏ2గా అశోక్, ఏ3గా దేవరాజ్ను చేర్చాం. పరారీలో ఉన్న మరో నిందితుడు అశోక్ను త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తాం. ఈ కేసులో శ్రావణి తల్లిదండ్రులు బాధితులుగా ఉన్నందున వారిని నిందితులుగా చేర్చడం కుదరదు’’ అని డీసీపీ వివరించారు. అరెస్ట్ చేసిన దేవరాజ్, సాయికృష్ణలను పోలీసులు త్వరలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నిందితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటివ్గా తేలింది. మరోవైపు శ్రావణి తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.
ఇవీ చదవండి..
శ్రావణి ఆత్మహత్యకు ముందు అసలేం జరిగింది?
శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని