అప్పట్లో ఇంటి నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు..!
సమాజంలో అందం, శరీరఛాయ ఆధారంగా చేసుకుని మనుషులను చులకనగా చూసే స్నేహితులు, బంధువులను తాను చూశానని నటి సాయిపల్లవి అన్నారు. ‘ప్రేమమ్’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆమె మొదటి సినిమాతోనే....
అది నన్ను ఎంతగానో బాధపెట్టింది: సాయిపల్లవి
హైదరాబాద్: సమాజంలో అందం, శరీరఛాయ ఆధారంగా చేసుకుని మనుషులను చులకనగా చూసే స్నేహితులు, బంధువులను తాను చూశానని నటి సాయిపల్లవి అన్నారు. ‘ప్రేమమ్’ చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆమె మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ హిట్తో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకొన్నారు. అయితే, రూ.2 కోట్లు ఇస్తామంటూ వచ్చిన ఓ ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనకు నటి సాయిపల్లవి నో చెప్పారంటూ.. గత కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నాడు ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనకు నో చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించారు.
‘సింపుల్గా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనకు నో చెప్పడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతమైన ఆలోచన. సమాజంలో మనం సృష్టించిన అందం, శరీరఛాయ అనే వాటిని ఆధారంగా చేసుకుని మనుషులను చులకనగా చూసే స్నేహితులు, బంధువులను నేను చూశాను. ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే ‘ప్రేమమ్’కు ముందు మొటిమలు పొగొట్టుకోడానికి ఎన్నో రకాల క్రీమ్స్ వాడాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేదాన్ని కాదు. ‘ఎదుటివారు కేవలం నా మొటిమలను మాత్రమే చూసి ఎందుకు మాట్లాడుతున్నారు.. నా కళ్లలోకి చూసి ఎందుకు మాట్లాడడం లేదు’ అని బాగా ఆలోచించేదాన్ని. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ ‘ప్రేమమ్’ తర్వాత ప్రజలు నన్ను నన్నుగానే ఇష్టపడ్డారు. దాని వల్ల ఎంతో మంది నా నుంచి ప్రేరణ పొందారు. ముఖ్యంగా టీనేజీ ఆడపిల్లలు. అది నాలో ధైర్యాన్ని నింపింది. సమాజంలో వాళ్లు ఒంటరి కాదు అని నిరూపించాలనుకున్నా. అంతేకాకుండా తెల్లగా మారడం కోసం నా సోదరి తనకి ఇష్టంలేని ఆహార పదార్థాలను సైతం తినేది. కాబట్టి, నా సోదరిలో ప్రేరణ నింపాడానికైనా నేను నాలానే ఉండాలని నిశ్చయించుకొన్నా. అందుకే ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనకు నో చెప్పాను’’ అని సాయిపల్లవి తెలిపారు.
వెట్రిమారన్ దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన ‘పావ కదైగల్’ నెట్ఫ్లిక్స్లో ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె రానా సరసన ‘విరాటపర్వం’లో నటిస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సాయి పల్లవి నక్సలైట్గా కనిపించనుంది. ‘విరాటపర్వం’ టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీనితోపాటు ఆమె నానితో ‘శ్యామ్ సింగరాయ్’లో సందడి చేయనున్నారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?