Allari naresh: ‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం.
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. చివరి రెండు రీళ్లు భావోద్వేగభరితంగా ఉంటాయి’’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన కథానాయకుడిగా మల్లి అంకం తెరకెక్కించిన ఈ సినిమాని రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఈ సినిమా ఈనెల 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అల్లరి నరేశ్ పంచుకున్న విశేషాలు..
ఈ చిత్రానికి మీ నాన్నగారి క్లాసిక్ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ పెట్టడం ఏమైనా ఒత్తిడిగా అనిపించిందా?
‘‘కచ్చితంగా ఉంది. ఆ సినిమాకి దీనికి పోలిక పెడతారేమోనని భయపడ్డాం. కానీ, ఈ రెండూ వేటికవే పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ చిత్రంలో హీరోకి 35ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాదు. అందరూ తనని ‘పెళ్లి ఎప్పుడూ.. పప్పన్నం ఎప్పుడు పెడతావ’ని అడుగుతుంటే చిరాకుతో అతను చెప్పే డైలాగ్ ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. కథకు సరిగ్గా సరిపోతుందనే ఆ పేరు పెట్టాం’’.
మళ్లీ ఇలాంటి వినోదాత్మక కథాంశాన్ని ఎంచుకోవడానికి కారణమేంటి?
‘‘నేను కామెడీకి దూరం జరగలేదు. కథలు బాగా నచ్చితే చేయాలనే అనుకున్నా. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి చాలా మారింది. కథలో వినోదం ఉంటేనే అందరూ ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి టైమ్లో మల్లి అంకం ఈ కథతో నా దగ్గరకొచ్చాడు. నిజ జీవితంలో జరిగిన చాలా సంఘటనల్ని పరిశోధించి తను ఈ కథను సిద్ధం చేసిన తీరు బాగా నచ్చింది. ఇందులో ఓ సహజత్వం ఉంది. కామెడీలోనే చక్కటి సందేశముంది. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి మోసాలు జరుగుతున్నాయన్నది దీంట్లో చూపించిన తీరు ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. అందుకే కథ విన్న వెంటనే చేయాలని నిర్ణయించుకున్నా’’.
మీరు భవిష్యత్తులో ఎలాంటి జానర్స్ ప్రయత్నించాలనుకుంటున్నారు?
‘‘నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. డార్క్ హ్యూమర్ ఉన్న కథల్ని బాగా ఇష్టపడతా. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం నేను అలాంటి కథలపై దృష్టి పెడుతున్నా. అలాగే ‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలని ఉంది. దాంతో పాటు ‘జోకర్’ లాంటి పాత్ర చేయాలని ఉంది. మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి’’.
ఈ చిత్రంలో వినోదాన్ని.. సందేశాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు?
‘‘సినిమా ఆద్యంతం నవ్వులు పంచినప్పటికీ ఆఖర్లో ఏదో మంచి సందేశం ఉండాల్సిందే. ‘కితకితలు’ కామెడీ సినిమానే. కానీ, అందులో చూపించిన సందేశం అందరికీ అద్భుతంగా కనెక్ట్ అయింది. మా నాన్న తీసిన సినిమాల్లోనూ అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుంది. అలాగే మా చిత్రంలో చూపించనున్న సందేశం కూడా ప్రేక్షకుల్ని కదిలించేలా ఉంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది’’.
మీ కొత్త చిత్ర విశేషాలేంటి? దర్శకత్వం ఆలోచన ఉందా?
‘‘నేను ప్రస్తుతం ‘బచ్చల మల్లి’ అనే సినిమా చేస్తున్నా. అలాగే మరో రెండు చిత్రాలు ఒప్పుకున్నా. దర్శకత్వం చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి కానీ, దానికి ఇంకా చాలా సమయం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?