రామోజీ ఫిల్మ్‌సిటీలో కార్తి.. త్రిష

అద్భుతమైన చోళ రాజ్యం..అందులో పరాక్రమ రాకుమారుడు...అందమైన సుందరీమణులు...వీళ్ల మధ్య ఓ పాట... ఇలాంటి అలరించే సన్నివేశానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. చోళ రాజుల కథతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’

Updated : 07 Aug 2021 07:04 IST

ద్భుతమైన చోళ రాజ్యం..అందులో పరాక్రమ రాకుమారుడు...అందమైన సుందరీమణులు...వీళ్ల మధ్య ఓ పాట... ఇలాంటి అలరించే సన్నివేశానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. చోళ రాజుల కథతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. కార్తి, త్రిష, శోభితతో పాటు 200 మంది డ్యాన్సర్లపై గ్రేప్‌ గార్డెన్‌ రోడ్‌లో ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. బృంద మాస్టర్‌ ఈ గీతానికి నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం ‘పీఎస్‌ 1’ వచ్చే ఏడాది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు