మోహన్‌బాబుకి స్టైలిష్ట్‌గా విష్ణు సతీమణి

మంచు విష్ణు సతీమణి వెరోనికా మొదటిసారి మోహన్‌బాబు స్టైలిస్ట్‌గా వ్యవహరించనున్నారు. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’

Published : 24 Oct 2020 02:00 IST

‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఆరంభమైంది

హైదరాబాద్‌: మంచు విష్ణు సతీమణి వెరోనికా మొదటిసారి మోహన్‌బాబు స్టైలిష్ట్‌గా వ్యవహరించనున్నారు. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమానికి ఆమె స్టైలిష్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. విభిన్న కథా చిత్రంగా తెరకెక్కనున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో ప్రారంభమైంది. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి మోహన్‌బాబు స్ర్కీన్‌ప్లే అందించారు.

‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రారంభమైన సందర్భంగా మోహన్‌బాబుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కుమార్తె లక్ష్మి ఓ ట్వీట్‌ పెట్టారు. ‘కంగ్రాట్స్‌ నాన్న! దీని కోసం నేను ఎంతో కాలంగా వేచిచూస్తున్నాను. మీ అద్భుతమైన నటనను వెండితెరపై చూడడానికి ఆసక్తిగా ఉన్నాను. ఆల్‌ ది బెస్ట్‌.’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని