ఆ ఇద్దరిలో ఎవరితో?

దర్శకుడు బోయపాటి శ్రీను తర్వాతి చిత్రంపై చిత్రసీమలో ఆసక్తికర చర్చ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ హీరోగా ‘అఖండ’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. దీని తర్వాత ..

Published : 25 May 2021 01:04 IST

ర్శకుడు బోయపాటి శ్రీను తర్వాతి చిత్రంపై చిత్రసీమలో ఆసక్తికర చర్చ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ హీరోగా ‘అఖండ’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. దీని తర్వాత ఆయన చేయనున్న ప్రాజెక్ట్‌ ఎవరితో ఉంటుందన్నది ఇంత వరకు తేలలేదు. అయితే ప్రస్తుతం చిత్రసీమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆయన తన తర్వాతి చిత్రం కోసం కథానాయకులు రవితేజ, అల్లు అర్జున్‌లను సంప్రదించినట్లు తెలుస్తుంది. ఆయన ఇప్పటికే ఈ ఇద్దరికీ కథలు వినిపించారని.. స్క్రిప్ట్‌లు నచ్చడంతో వారూ ఆయనతో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం వినిపిస్తోంది. అయితే వీరిద్దరిలో ముందు ఏ హీరో నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందన్నది తేలాల్సి ఉంది. బోయపాటి గతంలో రవితేజతో ‘భద్ర’, అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ లాంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ ఇద్దరిలో ఎవరి చిత్రం ఖరారైనా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడతాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికైతే రవితేజ.. నక్కిన త్రినాథరావు కొత్త సినిమాతో, అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని