కథ కుదిరే.. కలయిక అదిరే
వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా.. మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు. సినీ డైరీ ఖాళీ అయ్యేలోపు ఓ కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు.
వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా.. మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు. సినీ డైరీ ఖాళీ అయ్యేలోపు ఓ కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు. ఇందులో కొన్ని ప్రాజెక్ట్లు ఇప్పటికే పక్కా అయినట్లు సమాచారం. అవి త్వరలోనే కార్యరూపంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
నాని రొమాంటిక్ కామెడీ
కొత్త ప్రతిభను.. కొత్త కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘దసరా’ ఇలాంటి ప్రయత్నమే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడ్ని తెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత నాని చేయనున్న కొత్త చిత్రం సైతం ఓ నూతన దర్శకుడే రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని వెబ్సిరీస్లతో నిరూపించుకున్న శౌర్య అనే దర్శకుడు నానికి ఓ కథ వినిపించారని.. అది ఆయనకు నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారని సమాచారం. ఇదొక భిన్నమైన రొమాంటిక్ కామెడీ చిత్రంలా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీన్ని చెరుకూరి మోహన్ నిర్మించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, ‘దసరా’ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందని ప్రచారం వినిపిస్తోంది.
ఈనెలలోనే శ్రీకారం..
నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చైతూ చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఆయన కోసం పరశురామ్ ఓ కథ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపించినా.. ఆ తర్వాత దానిపై స్పష్టత రాలేదు. దీనికి తోడు ఇటీవల ఆయన బాలకృష్ణకు ఓ కథ వినిపించనున్నట్లు చెప్పడంతో చైతన్యతో సినిమా లేకపోవచ్చని ప్రచారం వినిపించింది. అయితే ఇప్పుడు నాగచైతన్య - పరశురామ్ల ప్రాజెక్ట్ ఖరారైనట్లు సమాచారం. దీన్ని 14రీల్స్ ప్లస్ పతాకంపై నిర్మించనున్నారు. వెంకట్ ప్రభు సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.
శర్వా సిద్ధమే
‘ఒకే ఒక జీవితం’ విజయం శర్వానంద్కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఈ జోష్లోనే ఆయన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించారు. కానీ, అనూహ్యంగా ఆ చిత్రం ఆగిపోవడంతో మళ్లీ కథల వేటలో పడ్డారు శర్వా. ఈ క్రమంలోనే ఇప్పుడాయన ఓ కథకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ‘భలే మంచి రోజు’, ‘దేవదాస్’, ‘హీరో’ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఆయన ఇటీవలే శర్వానంద్కు ఓ కొత్తదనం నిండిన కథ వినిపించినట్లు తెలిసింది. అది శర్వాకు బాగా నచ్చడంతో సినిమాకి పచ్చజెండా ఊపారని సమాచారం. అయితే దీన్ని ఎవరు నిర్మిస్తారన్నది తేలాల్సి ఉంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.
‘భీష్మ’ దర్శకుడితో..
నితిన్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కాగా, ఇప్పుడాయన మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ‘భీష్మ’ చిత్రంతో నితిన్కు విజయాన్ని అందించారు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ కలయికలోనే ఇప్పుడు మరో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. స్క్రిప్ట్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్కు నితిన్ ఓకే చెప్పారని తెలిసింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం