Venkatesh: పండగే పండగ అన్నట్టు ఉంటుంది.. ‘సైంధవ్’: వెంకటేశ్
కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా నా 75వ చిత్రం ‘సైంధవ్’ని చేశానన్నారు వెంకటేశ్. ఆయన కథానాయకుడిగా.. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.
కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా నా 75వ చిత్రం ‘సైంధవ్’ని చేశానన్నారు వెంకటేశ్. ఆయన కథానాయకుడిగా.. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, ఆండ్రియా, బేబీ సారా కీలకపాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఆదివారం రాత్రి విడుదలకి ముందస్తు వేడుక నిర్వహించారు. వెంకటేశ్ మాట్లాడుతూ ‘‘తొలి సినిమా నుంచీ విశాఖతో అనుబంధం ఉంది. ‘సైంధవ్’ చిత్రీకరణ కూడా చాలా రోజులు ఇక్కడే చేశాం. కొత్తతరం థ్రిల్లర్గా, కొత్త రకమైన యాక్షన్తో సినిమాని చేశాం. మంచి సినిమా ఇవ్వాలని అందరం కష్టపడి పని చేశాం. పండగ రోజు వస్తుంది. పండగే పండగ అన్నట్టుగా ఉంటుంది. ఇందులో అసలు హీరో సారా పాపనే’’ అన్నారు.
దర్శకుడు శైలేశ్ కొలను మాట్లాడుతూ ‘‘గొప్ప నటులతో నిజాయతీతో కూడిన ఓ అందమైన సినిమాని తీశాం. ఇందులో అద్భుతమైన డ్రామా ఉంది. వెంకటేశ్ని ఎప్పుడూ చూడని రకంగా చూపించేందుకు ప్రయత్నించా. ఈ సినిమాకి ముందు కమల్హాసన్ అభిమానిని అని చెప్పుకునేవాడిని. దీని తర్వాత వెంకటేశ్ అభిమానిని కూడా అయిపోయా. దీనికి ప్రాణం పెట్టి పనిచేశాం. ప్రేక్షకులు ఆస్వాదించడమే మిగిలింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరి హృదయాల్ని గెలుచుకోవాలని, థియేటర్ నుంచి బయటికొస్తే అందరి మొహాల్లో ఓ ఆనందం ఉండాలి. కచ్చితంగా అది నెరవేరుతుంది’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. రుహానీశర్మ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అన్ని భావోద్వేగాలు ఉన్నాయి. ప్రతి పాత్ర, ప్రతి భావోద్వేగం నచ్చుతుంది. ‘హిట్’ తర్వాత ఈ సినిమాలో మళ్లీ ఓ శక్తిమంతమైన పాత్రని ఇచ్చినందుకు శైలేశ్కి కృతజ్ఞతలు’’ అన్నారు.
‘‘ఇందులో భాగమైనందుకు గర్వపడుతున్నా. వెంకటేశ్, శైలేశ్లకి కృతజ్ఞతలు. వెంకటేశ్ సర్ విభిన్నమైన అవతారంలో కనిపిస్తారు. అందరినీ ఆశ్చర్య పరుస్తారు. ఈ నెల 13న అందరూ కలిసి ఆస్వాదిస్తాం’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘యాక్షన్ చేసే హీరోలు ఉంటారు. సెంటిమెంట్ బాగా చేసే హీరోలు ఉంటారు. ఈ రెండింటినీ కలిపి చేసే కథానాయకులు కొంతమందే. అందులో మొదటి వరసలో ఉండే కథానాయకుడు వెంకటేశ్. సాహిత్య విలువలతో కూడిన పాటలు రాశా. ఇది చరిత్రని తిరగరాసే చిత్రం అవుతుంది’’ అన్నారు. పండగకి వస్తున్న ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుందన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో గ్యారీ, మణికందన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్