Mohanlal:‘దృశ్యం 3’ కోసమేనా?

నటుడు మోహన్‌లాల్‌, దర్శకుడు జీతూ జోసెఫ్‌ల కలయికకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరి కలయిక నుంచి వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి.

Published : 24 May 2021 18:24 IST

టుడు మోహన్‌లాల్‌, దర్శకుడు జీతూ జోసెఫ్‌ల కలయికకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరి కలయిక నుంచి వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడీ ఇద్దరి కలయికలో మరో చిత్రం రానున్నట్లు.. మలయాళ చిత్రసీమ నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో మోహన్‌లాల్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇది ‘దృశ్యం 3’ చిత్రమయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. నిజానికి మలయాళ ‘దృశ్యం 2’ ముగింపులోనే తర్వాతి భాగంపై జీతూ పరోక్షంగా స్పష్టతనిచ్చారు. ఇప్పుడాయన మోహన్‌లాల్‌కు వినిపించిన కథ అదే అని మలయాళ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి జీతూ జోసెఫ్‌ తెలుగులో వెంకటేష్‌తో ‘దృశ్యం 2’  రీమేక్‌ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని