Manoj Manchu: మంచు మనోజ్‌ సరికొత్త టీవీ షో.. ఎక్కడో తెలుసా?

Manoj Manchu: మంచు మనోజ్‌ వ్యాఖ్యాతగా త్వరలో ఓ షో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మనోజ్‌ అభిమానులతో పంచుకున్నారు.

Updated : 22 Sep 2023 20:33 IST

హైదరాబాద్‌: సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన సినీ నటుడు మంచు మనోజ్‌ మళ్లీ ట్రాక్‌ ఎక్కారు. ఇప్పటికే ఆయన కథానాయకుడిగా ‘వాట్‌ ది ఫిష్‌’ చిత్రం తెరకెక్కుతోంది. మనం మనం.. బరంపురం అనేది ఉప శీర్షిక. వరుణ్‌ కోరుకొండ దర్శకుడు. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ వేదికగా ఓ టాక్‌ షో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మంచు మనోజ్‌ రీఎంట్రీపై తన వాయిస్‌ను వినిపించారు.

‘‘నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి సినిమాపై పెంచుకున్న ప్రేమ ప్రొఫెషన్‌గా మారింది. నన్ను ఒక నటుడిగానూ, హీరోగానూ చేసింది. రాకింగ్‌ స్టార్‌ అనే పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్‌, విజిల్స్‌ ,అరుపులు కేకలు ఇలా పండగలా జరిగిన నా కెరీర్‌లోకి ఓ సైలెన్స్‌ వచ్చింది. మనోజ్‌ అయిపోయాడన్నారు. కెరీర్‌ ఖతం అన్నారు. యాక్టింగ్‌ ఆపేశాడు. తిరిగి రాడన్నారు. అన్నీ విన్నా.. చూశా.. మౌనంగా భరించా.. తిరిగొస్తున్నాను’’ అంటూ మంచు మనోజ్‌ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని