Nawazuddin Siddiqui: విలన్‌.. వికాస్‌ మాలిక్‌

వెంకటేష్‌ కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సైంధవ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా కథానాయికలు.

Updated : 20 May 2023 12:30 IST

వెంకటేష్‌ (Venkatesh) కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా కథానాయికలు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శుక్రవారం నవాజుద్దీన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. అందులో ఆయన ఓ ఖరీదైన కారుపై కూర్చొని.. బీడీ తాగుతూ క్లాస్‌ లుక్‌లో కనిపించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు వికాస్‌ మాలిక్‌. ‘‘వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. వెంకటేష్‌ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ స్వరాలందిస్తున్నారు. ఎస్‌.మణికందన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని