samantha: ఆ యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోండి: సమంత తరపు న్యాయవాది
సినీ నటి సమంత వేసిన పరువునష్టం దావా కేసు విచారణ హైదరాబాద్ కూకట్పల్లిలోని న్యాయస్థానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే
హైదరాబాద్: సినీ నటి సమంత వేసిన పరువునష్టం దావా కేసు విచారణ హైదరాబాద్ కూకట్పల్లిలోని న్యాయస్థానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తన క్లయింట్ పరువుకు నష్టం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వ్యవహరించాయని సమంత తరపు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులున్నాయని, సమంత, నాగచైతన్యకు విడాకులు మంజూరు కాకముందే వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవి ఆమె వ్యక్తిగత, వృత్తిపర జీవితానికి ఇబ్బంది కలిగిస్తాయని, తక్షణమే ఈ కేసును విచారించాలని కోరారు. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించి, ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, సోమవారం సమంత దాఖలు చేసిన పిటిషన్ పై మరోసారి వాదనలు జరిగాయి. సమంత ప్రతిష్ఠను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్పై చర్యలు తీసుకోవాలని ఆమె తరపు న్యాయవాది బాలాజీ న్యాయస్థానాన్ని కోరారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిపై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం సరైంది కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నామని, భవిష్యత్లో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. గతంలో శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజెంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని వాదనలు వినిపించారు. వాదనలు విన్న కూకట్పల్లి న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు