Tollywood: కథలే ఫలితాల్ని నిర్దేశిస్తాయి ఎప్పుడైనా!
‘‘పంపిణీదారుగా కంటే... నిర్మాతగానే ప్రయాణం బాగుంది. నచ్చిన కథలతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాణంలో ఉంటుంది’’ అన్నారు రాజేష్ దండా. హాస్య మూవీస్ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారాయన.
‘‘పంపిణీదారుగా కంటే... నిర్మాతగానే ప్రయాణం బాగుంది. నచ్చిన కథలతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాణంలో ఉంటుంది’’ అన్నారు రాజేష్ దండా (Rajesh Danda). హాస్య మూవీస్ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారాయన. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ తర్వాత ఆయన ‘ఊరు పేరు భైరవకోన’, ‘సామజవరగమనా’ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్, శ్రీవిష్ణులతో మరో రెండు సినిమాల్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజేష్ దండా శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘నా ప్రయాణం ‘స్వామిరారా’ సినిమాతో పంపిణీదారుగా మొదలైంది. సుమారు 82 చిత్రాల్ని పంపిణీ చేశా. పోస్టర్, టీజర్ని చూసి సినిమాలు విడుదల చేస్తుంటాం. అదొక విభిన్నమైన ఆట. ఆచితూచి ప్రయాణం చేస్తూ ఎక్కువ విజయాల్నే అందుకున్నా. ‘కేరాప్ సూర్య’, ‘ఒక్క క్షణం’, ‘నాంది’ తదితర చిత్రాలకి సహనిర్మాగా పనిచేశా. సందీప్కిషన్, వి.ఐ.ఆనంద్, అనిల్ సుంకరలతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్ల ప్రోత్సాహంతోనే నిర్మాణంలోకి అడుగుపెట్టా. మా సంస్థ నుంచి మొదట ‘ఊరు పేరు భైరవకోన’ మొదలైంది. కానీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ముందు విడుదలైంది. మా తొలి చిత్రం సూపర్ నేచురల్ ఫాంటసీ సినిమా. విజువల్ ఎఫెక్ట్స్ చాలా ప్రాధాన్యం ఉంది. దానికి సంబంధించిన పనులవల్లే సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. కథ అనుకున్నప్పుడే మంచి వాణిజ్య సినిమా అవుతుందని భావించాం. ఆగస్టులో విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫలితం వాణిజ్య పరంగా సంతృప్తినివ్వకపోయినా మంచి సినిమా తీశారనే పేరొచ్చింది. ఓటీటీలో ఆ సినిమా విజయం సాధించింది’’.
* ‘‘కరోనాకి ముందు ఆ తర్వాత అంటూ వేరు చేసి చూస్తారు కానీ... ఎప్పుడైనా కథలపైనే సినిమా ఫలితాలు ఆధారపడతాయి. కథ బాగుంటే... దాన్ని ప్రేక్షకులకి నచ్చేలా తీస్తే తప్పకుండా విజయం సాధ్యం. నిర్మాతగా ప్రయాణంపై సంతృప్తిగా ఉన్నా. కథ కోరుకున్నట్టుగా సినిమా తీయడమే ముఖ్యమని నమ్ముతా. అందుకే ఖర్చు ఎక్కువైనా రాజీపడకుండా సినిమాల్ని నిర్మిస్తున్నాం. శ్రీవిష్ణు కథానాయకుడిగా మేం నిర్మించిన ‘సామజవరగమన’ ఈ వేసవిలో విడులదవుతుంది. అదొక పూర్తిస్థాయి కుటుంబ వినోద చిత్రం. తదుపరి అల్లరి నరేష్ కథానాయకుడిగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేం సుబ్బు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాం శ్రీవిష్ణుతో ఓ చిత్రం. సాయిధరమ్ తేజ్ నాకు ఇష్టమైన హీరో. ఆయనతోనూ, ‘నాంది’ కలయికలో ఓ సినిమాని చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం