SSMB29: వాటిని నమ్మకండి.. మహేశ్‌-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్‌

రాజమౌళి - మహేశ్‌ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు.

Updated : 20 Apr 2024 18:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజమౌళి దర్శకత్వంలో స్టార్‌ హీరో మహేశ్‌ బాబు ఓ సినిమాలో (SSMB29) నటించనున్న సంగతి తెలిసిందే. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ షేర్‌ అవుతున్నాయి. తాజాగా వాటిపై నిర్మాత గోపాల్‌రెడ్డి స్పందించారు.

‘ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి రాజమౌళికి (SS Rajamouli) తప్ప మరెవరికీ ఏ అప్‌డేట్‌ తెలియదు. ఆయన చాలా అంకితభావం కలిగిన వ్యక్తి. నిరంతరం సినిమా కోసమే పని చేస్తారు. నేను విజయేంద్రప్రసాద్‌తో పలుమార్లు చర్చించాను. ఈ కథ మొత్తం విన్నా. అద్భుతంగా ఉంది. దీని షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? అనే అప్‌డేట్స్‌ అన్నీ రాజమౌళికే తెలుసు. దీని గురించి సోషల్ మీడియాలో వచ్చే గాసిప్‌లను నమ్మకండి’ అని చెప్పారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) కథను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగనుంది. మహేశ్‌ ఇంటెన్సిటీ ఉన్న నటుడని.. ఇది ఎంతో సాహసోపేతమైన కథ అని ఆయన గతంలో చెప్పారు. ఇందులో హాలీవుడ్‌ నటీనటులను తీసుకొనే అవకాశం కూడా ఉందన్నారు.

ఇటీవల మహేశ్-రాజమౌళి ఇద్దరూ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. అందులో మహేశ్‌ (Mahesh Babu)లుక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. లుక్‌ టెస్ట్‌లో భాగంగానే వీళ్లిద్దరూ దుబాయ్‌ వెళ్లారని రకరకాల వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు టాక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని