రాశీ ఖన్నా సవాలు స్వీకరించేదెవరంటే!

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్‌ తారలు మొక్కలు నాటి... మీరూ మొక్కలు నాటండి అని పిలుపునిస్తున్నారు. ఇటీవల యువ కథానాయిక రష్మిక మందన మొక్కలు నాటి రాశి ఖన్నాకు ఛాలెంజ్‌ వి

Updated : 20 Jul 2020 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్‌ తారలు మొక్కలు నాటి... మీరూ మొక్కలు నాటండి అని పిలుపునిస్తున్నారు. ఇటీవల యువ కథానాయిక రష్మిక మందన మొక్కలు నాటి రాశీ ఖన్నాకు ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. దానిని స్వీకరించిన రాశి ఖన్నా ఈ రోజు మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ట్వీట్‌ చేశారు. దీంతోపాటు మరో ముగ్గురుని నామినేట్‌ కూడా చేశారు. 

‘‘నన్ను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో నామినేట్‌ చేసినందుకు రష్మిక మందనకు ధన్యవాదాలు’’ అని రాశీ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు ‘‘ఈ ట్వీట్‌ చదువుతున్న అందరూ మొక్కలు నాటండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొనేలా చేయండి. ఈ ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లండి’’ అని రాశీ కోరారు. ఈ హరిత సవాలులో పాల్గొనాల్సిందిగా ప్రముఖ కథానాయికలు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ అగర్వాల్‌, తమన్నాను రాశీ ఖన్నా నామినేట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు