Naresh: నరేశ్‌కు ఊరట.. ఆయన ఇంట్లోకి రమ్య రఘుపతి రాకూడదు : కోర్టు ఉత్తర్వులు

నటుడు నరేశ్‌ (Naresh)కు కోర్టులో ఊరట లభించింది. ఆయన నివాసంలోకి రమ్య రఘుపతి రాకూడదని ఉత్తర్వులు ఇచ్చింది.

Updated : 02 Aug 2023 14:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నరేశ్‌ (Naresh)కు బెంగుళూరులోని సిటీ సివిల్ న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన నటించిన ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఇటీవల ఆయన మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) వేసిన దావాను కోర్టు కొట్టేసింది. ఇరు పక్షాల వాదనను విన్న న్యాయస్థానం, మెరిట్‌ లేని కారణంగా ఆమె దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు తాజాగా తీర్పును వెలువరించింది. సెన్సార్‌ బోర్డు చెప్పినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు పేర్కొంది. అలాగే, సెన్సార్ బోర్డు ఒక చిత్రాన్ని కల్పితమని సర్టిఫై చేస్తే దాని విడుదలను ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకునే ప్రసక్తే లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. నరేశ్‌ కుటుంబానికి చెందిన మరో కేసులోనూ కోర్టు ఈరోజు ఉత్తర్వులిచ్చింది. నరేశ్‌కు చెందిన నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి రమ్యరఘుపతి రాకుండా చూడాలని ఆయన కుటుంబసభ్యులు గతంలో కోర్టులో దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. నరేశ్‌ ఇంట్లోకి ఆమె రాకూడదంటూ  ఆదేశాలు జారీ చేసింది.

పెళ్లి వార్తలపై తరుణ్ క్లారిటీ

నరేశ్‌, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటి పవిత్రా లోకేశ్‌తో రిలేషన్‌లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండా.. వేరే మహిళతో నరేశ్‌ ఎలా సన్నిహితంగా ఉంటారంటూ గతంలో రమ్య మీడియా ముందుకు వచ్చారు. ‘మళ్ళీ పెళ్లి’లో తమ వ్యక్తిగత జీవితాన్ని.. ముఖ్యంగా తనను టార్గెట్‌ చేశారని ఇటీవల ఆమెను కోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని