Saindhav: బ్యాడ్‌ రివ్యూ గుడ్‌ ఫిల్మ్‌ని డ్యామేజ్‌ చేయలేదు: ‘సైంధవ్‌’ డైరెక్టర్‌

వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘సైంధవ్‌’. ఈ సినిమా ప్రదర్శితవుతున్న పలు థియేటర్లను వెంకటేశ్‌ సందర్శించారు.

Published : 15 Jan 2024 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘గుడ్‌ రివ్యూ బ్యాడ్‌ ఫిల్మ్‌ని రక్షించలేదు. బ్యాడ్‌ రివ్యూ గుడ్‌ ఫిల్మ్‌ని డ్యామేజ్‌ చేయలేదు’’ అని పేర్కొన్నారు ‘సైంధవ్‌’ డైరెక్టర్‌ శైలేష్‌ కొలను (sailesh kolanu). వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా శైలేష్‌ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది. వెంకటేశ్‌ హైదరాబాద్‌లోని పలు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల స్పందనను నేరుగా చూశారు. సంబంధిత వీడియోను శైలేష్‌ ‘ఎక్స్‌’ (ఇంతకు ముందు ట్విటర్‌)లో పోస్ట్‌ చేస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. సినిమా విడుదలై రెండు రోజులే అయిందని, రిలాక్స్‌ అయి ఫుల్‌ రన్‌ ఫలితం ఎలా ఉంటుందో చూడాలని కోరారు. ఆ తర్వాత మాట్లాడతానని అన్నారు.

సైంధ‌వ్‌ రివ్యూ

‘‘ఏది ఏమైనా మంచి చిత్రానికి ప్రేక్షకాదరణ లభిస్తుంది. మౌత్‌ టాక్‌పై నాకు నమ్మకం ఉంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మేం విభిన్న కథా చిత్రాన్ని అందించాం. అత్యధిక మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని చూస్తుండడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్‌కు ఇది 75వ చిత్రం. తండ్రి, కూతురు అనుబంధంతో చంద్రప్రస్థ అనే కల్పిత నగరం చుట్టూ అల్లుకున్న కథ ఇది. సైంధవ్‌ కోనేరు అలియాస్‌ సైకోగా వెంకటేశ్‌ మెప్పించారు. న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ప్రతినాయకుడిగా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్‌, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని