15Years for Arundhati: ‘అరుంధతి’ మూవీకి సోనూసూద్ పారితోషికం తెలిస్తే షాకే!
Arundhati Movie: అరుంధతి చిత్రంలో పశుపతిగా నటించిన సోనూసూద్ తొలుత ఆ పాత్ర చేయనని చెప్పారు. 20 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నారు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా జరిగింది.
ఇంటర్నెట్డెస్క్: అనుష్క (Anushka), సోనూసూద్ (Sonu sood) కీలక పాత్రల్లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన హారర్ ఫాంటసీ మూవీ ‘అరుంధతి’ (Arundhati). మల్లెమాల ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్యామ్ ప్రసాద్ నిర్మించారు. 2009 జనవరి 16న వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మంగళవారంతో ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చక్కని అభిరుచితో చిత్రాలు నిర్మించే శ్యామ్ ప్రసాద్రెడ్డి కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇది. రొటీన్ సినిమాలకు భిన్నంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అనుష్క కెరీర్ను కూడా మలుపు తిప్పింది. ‘అరుంధతి’ పాత్ర కోసం అనుష్క కంటే ముందు చాలా మంది పేర్లు అనుకున్నారు. కథపరంగా యువరాణి పాత్రలో కనిపించే నటి రాయల్ లుక్ కలిగి ఉండాలని నియమం పెట్టుకోవడం ఎక్కడా రాజీపడకుండా నిర్మాత శ్యామ్ ప్రసాద్రెడ్డి వరుస ఆడిషన్స్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో నిర్మాత జెమినీ కిరణ్ సూచన మేరకు నాగార్జున ‘సూపర్’లో నటించిన అనుష్కను చూసి ఓకే అనుకున్నారు. వెంటనే ఆమెకు ఆ విషయం చెప్పకుండా రకరకాల ఆడిషన్స్, లుక్ టెస్ట్ చేసి చివరకు ఫైనలైజ్ చేశారు.
తొలుత తమిళ నటుడు అనుకుంటే...
‘అరుంధతి’ చిత్రంలో మరో కీలక పాత్రను సోనూసూద్ (Sonu sood) పోషించారు. సినిమాను చూసిన తర్వాత పశుపతిగా ఆయనను తప్ప మరొకరని ఊహించుకోలేం. ఈ పాత్రకు మొదట తమిళ నటుడు పశుపతిని అనుకున్నారు. ఆ పేరు పెట్టడానికి కూడా కారణం అదే. అఘోర పాత్రకు పశుపతి చక్కగా సూట్ అవుతారని చిత్రం బృందం భావించింది. సినిమాలో కొన్ని సీన్లలో పశుపతి పాత్ర రాయల్ లుక్లో కనిపించాలి. దీంతో ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ చిత్రం విడుదలైంది. అందులో విలన్గా నటించిన సోనూసూద్.. నిర్మాత శ్యామ్ ప్రసాద్రెడ్డి దృష్టిని ఆకర్షించారు. అయితే అఘోరా గెటప్ స్కెచ్ చూపించగానే ఆ పాత్రను చెయ్యనని సోనూసూద్ చెప్పారు. ఒకసారి గెటప్ వేసుకోమని, మేకప్ టెస్ట్ చేసిన తర్వాత కూడా నచ్చకపోతే.. మరొక నటుడిని తీసుకుంటానని నచ్చజెప్పారు. అందుకు సోను అయిష్టంగానే అంగీకరించారు.
కమల్ హాసన్ నటించిన ‘దశావతారం’ చిత్రానికి వర్క్ చేసిన రమేశ్ను చెన్నై నుంచి పిలిపించి ఆయనతో సోనూసూద్కు అఘోరా గెటప్ వేయించారు. మేకప్ కోసమే ఆయనకు ఆరు గంటలు పట్టింది. ఆ పాత్ర చేయడం తనకు ఇష్టం లేకపోయినా శ్యామ్ ప్రసాద్రెడ్డి తపన చూసి చివరకు సోనూసూద్ అంగీకరించారు. పశుపతి పాత్రకు సంబంధించి 20 రోజుల్లో ఆయన వర్క్ పూర్తి చేస్తామని శ్యామ్ ప్రసాద్రెడ్డి చెప్పగానే, రూ.18 లక్షలు పారితోషికంగా ఇవ్వమని సోనూసూద్ డిమాండ్ చేశారు. ఆయన మరో ఆప్షన్ కూడా ఇచ్చారు. రూ.20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా పని చేస్తానని చెప్పారు. కానీ, శ్యామ్ ప్రసాద్రెడ్డి ఒప్పుకోలేదు. 20 రోజుల్లోనే అతని వర్క్ పూర్తి చేస్తాననీ, రూ.18 లక్షలే ఇస్తానని చెప్పారు. ఒక వేళ 20 రోజుల్లో వర్క్ పూర్తి కాకపోతే, ఆ తర్వాత ఎన్ని రోజులు ఎక్కువ వర్క్ చేస్తే రోజుకి రూ. 25 వేలు ఇస్తానని శ్యామ్ ప్రసాద్రెడ్డి చెప్పారు. అనుకున్నట్లుగా 20 రోజుల్లో సోనూసూద్ వర్క్ పూర్తి కాలేదు. చివరకు ‘అరుంధతి’ చిత్రం ద్వారా సోనూ సూద్ లభించిన పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.45 లక్షలు.
‘అరుంధతి’ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క (15Years for Arundhati) ట్వీట్ చేశారు. ‘జేజమ్మ పాత్రతో నేను ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం దక్కించుకున్నా. కోడి రామకృష్ణగారు, శ్యామ్ ప్రసాద్రెడ్డిగారికి నా కృతజ్ఞతలు. భారతీయ సినిమాలో ఇదొక ఎపిక్. మీ ప్రేమకు, సహకారానికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం
దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్స్టార్ అని సంబోధిస్తుంటారు. -
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ.. -
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్బాబు, పూరి జగన్నాథ్ల కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ..