20ఏళ్ల ‘నువ్వేకావాలి’.. ఈ విశేషాలు తెలుసా?
‘అనగనగా ఆకాశం ఉంది..’ అంటూ ఎక్కడైనా పాట వినపడితే చాలు చిన్నా పెద్దా అందరూ ఆ పాటనే హమ్ చేసేవారు. ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే’ అంటూ
ఇంటర్నెట్ డెస్క్: ‘అనగనగా ఆకాశం ఉంది..’ అంటూ పాట వినపడితే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆ పాటనే హమ్ చేసేవారు. ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే...’ అంటూ ప్రేమికులు మైమరచిపోయారు. ‘కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు...’ అంటూ విరహ గీతాన్ని ఆలపించారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘నువ్వే కావాలి’. మిలీనియం సంవత్సరంలో బాక్సాఫీసు దగ్గర చరిత్రను తిరగరాసిన చిత్రమిది. తరుణ్-రిచా జంటగా కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు 13 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. కథా బలమున్న చిత్రాలను నిర్మించే ఉషాకిరణ్ మూవీస్ నుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఇది. కోటి సంగీతం, త్రివిక్రమ్ సంభాషణలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తకర విశేషాలను తెలుసుకుందాం!
‘నీరమ్’ నుంచి...
మలయాళంలో కమల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘నీరమ్’. ఆ సినిమా చూసి స్ఫూర్తి పొందిన సవ్రంతి రవికిషోర్ తెలుగులోనూ ఆ కథా నేపథ్యంతో సినిమా తీయాలనుకున్నారు. అయితే, అప్పటికి ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయిన ఉషాకిరణ్ మూవీస్తో చేతులు కలిపి తాను స్ఫూర్తి పొందిన కథకు తెలుగుదనాన్ని జోడించి ఈ సినిమాను పట్టాలెక్కించారు. ఈ విషయంలో దర్శకుడు కె.విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్ విశేష కృషి చేశారు.
తరుణ్-రిచా అలా!
బాలనటుడిగా తరుణ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ‘నువ్వే కావాలి’తో తరుణ్ కథానాయకుడిగా మారారు. అప్పటివరకు 20-30 సినిమాల్లో బాలనటుడిగా చేసిన తరుణ్... ఆ తర్వాత సినిమాలు చేయాలని అనుకోలేదట. ఇంటర్ చదివేటప్పుడు రాజీవ్ మేనన్ ప్రకటనలో అతనితోపాటు రిచా కూడా సరదాగా నటించింది. అది చూసి ‘నువ్వే కావాలి’కి ఎంపిక చేసింది చిత్ర బృందం. ‘మనసు మమత’ ద్వారా బాల నటుడిగా తరుణ్ వెండితెరకు పరిచయం చేసిన ఉషాకిరణ్ మూవీస్... కథానాయకుడిగానూ తెరంగేట్రం చేయించడం విశేషం. హాస్యనటుడు నుంచి కథానాయకుడిగా మారిన సునీల్ కూడా ఈ సినిమాతోనే కాస్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాలో కాలేజ్ సన్నివేశాలు, కోవై సరళ కామెడీ నవ్వుల పువ్వులు పూయించింది.
మంత్ర ముగ్ధులను చేసిన కోటి సంగీతం
ఈ సినిమాకు మరో ప్రధాన బలం పాటలు. సాలూరి కోటేశ్వరరావు (కోటి) అందించిన పాటలు ఎవర్గ్రీన్. ముఖ్యంగా ‘అనగనగా ఆకాశం ఉంది...’, ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే...’, ‘కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు...’ పాటలు విశేష ఆదరణ పొందాయి. ‘అనగనగా ఆకాశం ఉంది...’ పాట లేకుండా ఆ రోజుల్లో ఏ కాలేజ్, స్కూల్ వార్షికోత్సవం ముగియలేదంటే అతిశయోక్తి కాదు.
త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన ముత్యాలు
ఈ సినిమాలో మరో హైలైట్ త్రివిక్రమ్ అందించిన సంభాషణలు. అప్పటికి ఆయనకు రెండు చిత్రాల అనుభవం మాత్రమే ఉంది. ఇప్పటికీ ఆ సంభాషణలు వింటుంటే అద్భుతంగా అనిపిస్తాయి.
‘‘భార్యాభర్తలు విడిపోవడానికి విడాకులు ఉన్నాయి. అన్నదమ్ములు విడిపోవడానికి ఆస్తులు ఉన్నాయి. కానీ, స్నేహితులు విడిపోవడానికి ఏమీ లేవు.. చావాల్సిందే’’
‘‘గొంతులో ఉన్న మాట అయితే, నోటితో చెప్పగలం. కానీ, గుండెలో ఉన్న మాట కేవలం కళ్లతోనే చెప్పగలం’’
థియేటర్లలో రికార్డులు
‘నువ్వే కావాలి’ అక్టోబరు 13న 22 ప్రింట్లతో విడుదలైంది. పబ్లిక్ మౌత్ టాక్తో కొద్దిరోజుల్లోనే 110 ప్రింట్స్కు చేరి సంచలనం సృష్టించింది. సినిమా వందో రోజున హైదరాబాద్ ఓడియన్ థియేటర్ కాంప్లెక్స్లోని 3 థియేటర్లలోనూ 4 షోలు ప్రదర్శించారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో ఉషాకిరణ్ మూవీస్ ‘తుజే మేరీ కసమ్’ పేరుతో రితేష్ దేశ్ముఖ్-జెనీలియా జంటగా నిర్మించింది. అక్కడ కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ను తెచ్చుకుంది.
అవార్డులు
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు, అవార్డుల పరంగానూ ‘నువ్వే కావాలి’ దూసుకుపోయింది. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇక ఉత్తమ చిత్రం పురస్కారంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా విజయ్ భాస్కర్, ఉత్తమ నటుడిగా తరుణ్, ఉత్తమ నటిగా రిచా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా శ్రీరామ్ ప్రభుకి.. ఫిల్మ్ ఫేర్- సౌత్ అవార్డులు వరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్