Tollywood: ప్రాణమంతా... పాన్ ఇండియా
శత దినోత్సవాల సందడులు కనుమరుగయ్యాయి. వందకోట్ల క్లబ్లు మసకబారుతున్నాయి. ఇప్పుడందరి శ్వాస, ధ్యాస ఒకటే.. అదే పాన్ ఇండియా ఇమేజ్. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ.. తమ ప్రతిభను నలుదిశలా వ్యాప్తిచేసి.. కాసులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు కథానాయకులు.
శత దినోత్సవాల సందడులు కనుమరుగయ్యాయి. వందకోట్ల క్లబ్లు మసకబారుతున్నాయి. ఇప్పుడందరి శ్వాస, ధ్యాస ఒకటే.. అదే పాన్ ఇండియా ఇమేజ్. ప్రాంతీయ, భాషా హద్దులు చెరిపేస్తూ.. తమ ప్రతిభను నలుదిశలా వ్యాప్తిచేసి.. కాసులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు కథానాయకులు. పాన్ ఇండియా సంస్కృతిని ఒంటబట్టించుకుని.. వేల కోట్ల క్లబ్బుల్లో కాలు మోపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా అవతరించగా.. ఇప్పుడీ కిరీటం అందిపుచ్చుకునేందుకు మరికొందరు తెలుగు హీరోలు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. మరి కొత్తగా ఈ రేసులోకి అడుగు పెడుతున్న ఆ కథానాయకులెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
కొన్నాళ్లుగా తెలుగు కథానాయకుల మనసంతా పాన్ ఇండియా కథల చుట్టూనే తిరుగుతోంది. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాల స్ఫూర్తితో ప్రభాస్, యష్ తరహాలో పాన్ ఇండియా మార్కెట్ను కొల్లగొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కథ కాస్త వైవిధ్యంగా ఉండి.. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తే చాలు.. స్టార్ బలాన్ని దించి.. సాంకేతిక హంగులు జోడించి పాన్ ఇండియా సినిమాగా వడ్డించే ప్రయత్నం చేస్తున్నారు. నలుదిశలా మార్కెట్ విస్తరించే యత్నం చేస్తున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం అనేక మంది తెలుగు హీరోలు ఈ పాన్ ఇండియా బాటలోనే నడుస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో ఇప్పటికే ఈ ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో కథానాయకుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ప్రయత్నానికి పర భాషల్లోనూ మంచి ఆదరణే దక్కింది. ఉత్తరాది వాసుల్ని ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్గా బన్నీ నటనకు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలోనే దీనికి కొనసాగింపుగా రానున్న ‘పుష్ప 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మనసులు దోచుకోవడానికి ‘వీరమల్లు’
జయపజయాలతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు పవన్ కల్యాణ్. ఇప్పుడాయన ‘హరి హర వీరమల్లు’తో తన క్రేజ్ను జాతీయ స్థాయికి విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పవన్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా. క్రిష్ తెరకెక్కిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇందులో పవన్ ఓ గజదొంగగా కనిపించనున్నట్లు సమాచారం. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజమౌళి తోడుగా మహేష్
పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు హీరో మహేష్బాబు. ఇప్పుడా బాధ్యతను తన భుజాలకు ఎత్తుకోనున్నారు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన మహేష్తో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అయితే ఇది సెట్స్పైకి వెళ్లడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా గాండ్రించాలని..!
తెలుగు సినీప్రియుల మదిలో మాస్రాజాగా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు కథానాయకుడు రవితేజ. ఇప్పుడాయన ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాన్ ఇండియా రేసులో అడుగు పెట్టనున్నారు. స్టూవర్ట్పురంలోని గజ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. 1970 బ్యాక్డ్రాప్లో సాగుతుంది. వంశీ తెరకెక్కించనున్న ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
కుర్ర హీరోల జోరు..
ప్రస్తుతం పాన్ ఇండియా కిరీటం అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్న వారి జాబితాలో పలువురు కుర్రహీరోలు ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘టాక్సీవాలా’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరయ్యారైన హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడాయన్ని ‘లైగర్’తో పాన్ ఇండియా హీరోగా మారుస్తున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ సినిమా కోసం మైక్ టైసన్ లాంటి దిగ్గజ క్రీడాకారుడ్ని సెట్స్లోకి దింపారు పూరి. ఈ సినిమా.. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
* ఓ వైపు హీరోగా.. మరోవైపు నిర్మాతగా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నందమూరి కల్యాణ్రామ్. త్వరలో ‘డెవిల్’గా దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని పలకరించనున్నారు. కల్యాణ్రామ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. 1945 కాలం నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇందులో కల్యాణ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించనున్నారు.
* 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా శశికిరణ్ తిక్క తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ పాత్రలో నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలం విడుదల కానుంది. ఇలా దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించే పనిలో మన కథానాయకులున్నారు.
త్వరలో ఇద్దరు వీరుల దండయాత్ర
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడీ ఇమేజ్ను ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు ఎన్టీఆర్, రామ్చరణ్. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కల్పిత కథాంశంతో రూపొందింది. ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం