Nuvvu Naaku Nachav: 20 వసంతాల క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’
Nuvvu Naaku Nachav: వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ 20ఏళ్లు పూర్తి చేసుకుంది
ఇంటర్నెట్డెస్క్: యాక్షన్తో పాటు కామెడీ కూడా చేసే అతికొద్ది మంది కథానాయకుల్లో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. సరైన పాత్ర పడితే, ఆయన కామెడీ టైమింగ్ను ఎవరూ అందుకోలేరు. అలా ఆయన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాంటి వాటిలో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతోనే ఆర్తి అగర్వాల్ కథానాయికగా పరిచయం అయింది. ఈ సినిమా విడుదలై నేటికి(సెప్టెంబరు 6) 20 ఏళ్లు.
కథేంటంటే: ఉద్యోగం కోసం తండ్రి శేఖరం(చంద్రమోహన్) స్నేహితుడైన మూర్తి (ప్రకాశ్రాజ్) ఇంటికి వస్తాడు వెంకీ అలియాస్ వెంకటేశ్వర్లు. అదే సమయంలో మూర్తి కుమార్తె(నందు)కు అమెరికా కుర్రాడితో నిశ్చితార్థం జరుగుతుంది. అది సజావుగా సాగడంలో వెంకీ వాళ్లకు సహాయపడతాడు. ఆ తర్వాత వెంకీకి మూర్తి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. వెంకీకి నందు తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్లను వదిలి వచ్చేయాలనుకుంటాడు వెంకీ. అయితే రైల్వే స్టేషను దాకా వెళ్లిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్లీ ఇంటికి తీసుకుని వస్తాడు. అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్లిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్లిలో మళ్లీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత అందరూ కలిసి వాటర్ వరల్డ్కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం(ఫొటోగ్రాఫర్) వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫొటో తీస్తాడు. ఆ ఫొటో నందూ పెళ్లి సమయంలో పెళ్లి కొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్లు నందు శీలాన్ని అవమానించి పెళ్లి పందిరి నుంచి వెళ్లిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్లి జరిపించాలని వెంకీ వాళ్లను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్లి చేయటంతో కథ సుఖాంతమవుతుంది.
తెర వెనుక జరిగింది ఇది: ‘నువ్వేకావాలి’ ఇచ్చిన విజయంతో కె.విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ కాంబోతో మరో సినిమా ప్లాన్ చేశారు నిర్మాత స్రవంతి రవికిషోర్. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కథ చెప్పమని అడిగితే, ‘నువ్వు నాకు నచ్చావ్’ వినిపించారు. ఇది కూడా తరుణ్తోనే తీస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అయితే, కాస్త కామెడీ టైమింగ్, ఎమోషనల్ సబ్జెక్ట్ కావటంతో మరో హీరోతో ప్రయత్నిద్దామనుకున్నారు. అదే సమయంలో నిర్మాత సురేశ్బాబు స్రవంతి రవికిషోర్కు ఫోన్ చేసి వెంకటేశ్ డేట్స్ ఉన్నాయని చెప్పారు. దీంతో దర్శకుడు విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్లు వెంకటేశ్ను కలిసి కథ వినిపించారు. ఆయనకు కూడా నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. అప్పటికీ కుటుంబ కథా చిత్రాలతో పాటు, మాస్ ఆడియన్స్ను అలరించేలా వెంకీ సినిమాలు ఉండటంతో పూర్తి హాస్యభరిత చిత్రమంటే ఒకరకంగా సాహసమనే చెప్పాలి.
ఇక కథానాయికగా త్రిష, గజాలా పేర్లు వినిపించాయి. కానీ, ఒక హిందీ సినిమా చేసిన ఆర్తి అగర్వాల్ను హీరోయిన్గా తీసుకున్నారు. కథానాయిక తండ్రి పాత్ర కోసం నాజర్ అయితే బాగుంటుందని దర్శకుడు విజయ్ భాస్కర్ సూచించారు. కానీ, స్రవంతి రవికిషోర్ మాత్రం ప్రకాశ్రాజ్ను తీసుకుందామని గట్టిగా పట్టుబడ్డారు. అదే సమయంలో ఆయనపై నిషేధం ఉండటంతో ప్రకాశ్రాజ్ లేకుండా ఉన్న పార్ట్ను పూర్తి చేశారు. ప్రకాశ్రాజ్పై నిషేధం ఎత్తివేసిన మరుక్షణం ‘నువ్వునాకు నచ్చావ్’లో ఆయన సన్నివేశాలు తీశారు. అదే విధంగా వాటర్ వరల్డ్లో బ్రహ్మానందం పాత్ర కూడా లేదు. వెంకటేశ్ సూచనల మేరకు ఆయన పాత్రను రాసుకున్నారు. అందుకు మిస్టర్ బీన్ను స్ఫూర్తిగా తీసుకున్నారు.
ఎవర్గ్రీన్ టెక్నికల్ టీమ్: ఈ సినిమాలో నటీనటులు ఎంత బాగా చేశారో.. అంతకుమించి సాంకేతిక బృందం కష్టపడింది. దర్శకుడు కె.విజయ్ భాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచన సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. కోటి అందించిన సంగీతం, పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్గ్రీన్. కె.రవీంద్రబాబు ప్రతీ ఫ్రేమ్ను అందంగా చూపించారు. సినిమా బాగుంటే మూడు గంటలు ఉన్నా హాయిగా చూస్తారనడానికి ‘నువ్వు నాకు నచ్చావ్’ ఒక నిదర్శనం.
సెప్టెంబరు 6, 2001లో విడుదలై ‘నువ్వు నాకు నచ్చావ్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. వెంకటేశ్ కామెడీ టైమింగ్, ఆర్తి అగర్వాల్ అందం, బ్రహ్మానందం, ప్రకాశ్రాజ్, ఎం.ఎస్.నారాయణ, సునీల్ల సన్నివేశాలు విపరీతంగా నవ్వులు పంచాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్కు క్యూ కట్టారు. ఒక్కొక్కరూ రెండు, మూడు సార్లు సినిమా చూశారంటే అతిశయోక్తి కాదు. 93 సెంటర్లలో 50 రోజులు, 57 సెంటర్లలో 100 రోజులు, మూడు కేంద్రాల్లో 175 ఆడి ఆ సమయానికి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది.
త్రివిక్రమ్ కామెడీ పంచ్లకు జనాలు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ప్రకాశ్రాజ్ కుటుంబం అంతా భోజనానికి కూర్చొన్న సమయంలో దేవుడిపై వెంకటేశ్ చేసే ప్రార్థన.. ఆ తర్వాత అమ్మపై ప్రకాశ్రాజ్ చదివే కవిత ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. టీవీలో ఎప్పుడు ప్రసారమైనా బోరు కొట్టని సినిమాల జాబితాలో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఉంటుంది.
‘‘ దేవుడా ఓ మంచి దేవుడా..!
నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పిచ్చావ్
బంగాళ దుంప ఫ్రై ఇచ్చావ్...
చారు కూడా ఇచ్చావ్..
ఇలాగే మన స్టేట్ లో ఉన్న
ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి..
అలాగే మన కంట్రీలో ఉన్న
తొంబై కోట్ల మందికి
అదే చేత్తో ప్రపంచంలో ఉన్నా..
హ్..నాకు నెంబర్ కరెక్ట్ గా తెలీదు..
ఎంతమందుంటే వాళ్లందరికీ కూడా
ఇదే భోజనం ఇస్తావని..
హా..అంటే.. యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కాదు
వాళ్ళు ఏం తింటే అది..
బ్రెడ్డు, బటరు, జాము అలాగన్న మాట
అలా ఇస్తావని కోరుకుంటున్నాను..
నువ్విస్తావు నాకు తెలుసు..
ఎందుకంటే బేసికల్లీ యువర్ గాడ్.. యు ఆర్ వెరీ గుడ్ గాడ్
ప్రార్థన మీ అందరికి
కొంచెం కొత్తగా అనిపించొచ్చు’’ అని వెంకటేశ్ అనగానే అమ్మపై ప్రకాశ్రాజ్ కవిత ఇలా చెప్పుకొస్తారు.. ‘‘ అమ్మా! అడక్కుండానే జన్మనిచ్చావ్. ఏడిస్తే పాలిచ్చావ్...వానోస్తే గొడుగు ఇచ్చావ్... ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావ్... వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావ్...వేసుకోవడానికి బట్టలు ఇచ్చావ్...చూసుకోవడానికి అద్దం ఇచ్చావ్...రాసుకోవడానికి పలకనిచ్చావ్...గీసుకోవడానికి గడ్డం ఇచ్చావ్... అందుకే..అందుకే...నువ్వు నాకు నచ్చావ్...కానీ, ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావ్...అయినా, నువ్వు నాకు నచ్చావ్...’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్