Matti Muksti: విష్ణు విశాల్‌.. ‘మట్టి కుస్తీ’

కథానాయకుడు రవితేజ నిర్మాణంలో విష్ణు విశాల్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. చెల్లా అయ్యావు దర్శకుడు. ఆర్‌.టి. టీమ్‌ వర్క్స్‌, విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐశ్వర్య

Updated : 06 Apr 2022 09:05 IST

కథానాయకుడు రవితేజ నిర్మాణంలో విష్ణు విశాల్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. చెల్లా అయ్యావు దర్శకుడు. ఆర్‌.టి. టీమ్‌ వర్క్స్‌, విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమాకి ‘మట్టి కుస్తీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘‘స్పోర్ట్స్‌ ఫ్యామిలీ డ్రామా చిత్రమిది. రెజ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథ   కావడంతో.. అందుకు తగ్గట్లుగా ‘మట్టి కుస్తీ’ అనే టైటిల్‌ ఖరారు చేశాం. ఇందులో విష్ణు విశాల్‌ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ  సినిమాకి జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందిస్తున్నారు. రిచర్డ్‌ ఎమ్‌ నాథన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని