అక్కడ మాస్కులు ధరించడం ఇక ప్రజల ఇష్టం!
బ్రిటన్లో ఇక మాస్కు పెట్టుకోవడం ప్రజల ఇష్టానికే వదిలేసే రోజులు రానున్నాయి.
కొవిడ్ నిబంధనలు ఎత్తివేసే యోచనలో ప్రధాని బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్లో ఇక మాస్కు పెట్టుకోవడం ప్రజల ఇష్టానికే వదిలేసే రోజులు రానున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న నేపథ్యంలో దేశంలో ఈనెల 19 నుంచి లాక్డౌన్ నిబంధనలను ఎత్తివేసేందుకు ప్రధాని సిద్ధమవుతున్నట్లు బ్రిటన్ మీడియాలో వార్తలొచ్చాయి. కొవిడ్తో సహజీవనం చేస్తూనే ఆంక్షలను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మాస్కులు పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేయకుండా కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి రాబర్ట్ జెన్రిక్ ఆదివారం తెలిపారు. పలు కొవిడ్ నిబంధనలు ఇక ఐచ్ఛికమేనని వచ్చేవారంలోనే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటిస్తారని బ్రిటన్ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతం అవుతోందన్నారు. ‘‘ఇప్పుడు నిబంధనలను ఎత్తివేసేందుకు, వీలయినంతమేర సాధారణ జీవనం సాగించే పరిస్థితులు తిరిగి రావడానికి ఆస్కారం ఏర్పడింది. అయితే వైరస్తో కలిసి జీవించడం నేర్చుకొనే ఓ విభిన్న కాలానికి మనమంతా వెళుతున్నాం’’ అని అన్నారు. చాలామంది ప్రజల్లాగే తాను కూడా వీలయినంత త్వరగా ఈ నిబంధనల నుంచి బయట పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘కొవిడ్ ఆంక్షలు లేని కాలానికి మనమంతా వెళుతున్నాం. అయితే మీరేం చేయాలో ప్రభుత్వం చెప్పదు. మీకు మీరే వ్యక్తిగత బాధ్యత తీసుకుని జాగ్రత్తలు పాటించాలి. ఈ దిశగా నిర్ణయానికి రావాలి’’ అని ప్రజలనుద్దేశించి అన్నారు.
మరోవైపు ‘స్వేచ్ఛా కాలం’ దిశగా ముందుకెళుతూ.. భౌతిక దూరం సహా పలు నిబంధనలను ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రధాని ఉన్నట్లు ‘ది సండే టైమ్స్’ పేర్కొంది. ‘‘బార్లు, రెస్టారెంట్లు, హెయిర్ డ్రెస్సర్లు, జిమ్, మ్యూజియం వంటి వాటిలోకి వెళ్లేందుకు స్కాన్ చేసే నిబంధనలను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. అలాగే స్వదేశీ కొవిడ్-19 పాస్పోర్టు ప్రతిపాదనలనూ జాన్సన్ తిరస్కరించారు. ఇప్పుడు కొవిడ్తో సహజీవనం సాగించడం గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి’’ అని ఆ పత్రిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.