జేడీయూకు ఎల్జేపీ గండి..!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే మరోసారి విజయం దిశగా దూసుకెళుతోంది. ఎన్డీయే కూటమిలోని భారతీయ జనతా పార్టీ (భాజపా) అనూహ్యంగా పుంజుకోగా....
నీతీశ్ను ఇరకాటంలో పెట్టిన చిరాగ్
పుంజుకున్న భాజపా
ఇంటర్నెట్డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే మరోసారి విజయం దిశగా దూసుకెళుతోంది. ఎన్డీయే కూటమిలోని భారతీయ జనతా పార్టీ (భాజపా) అనూహ్యంగా పుంజుకోగా.. అదే సమయంలో గతం కంటే జేడీయూ మరిన్ని సీట్లు కోల్పోయింది. ఎన్డీయే నుంచి బయటకొచ్చి స్వతంత్రంగా పోటీ చేసిన ఎల్జేపీ.. జేడీయూ ఓట్లను చీల్చడం ఇందుకు కారణమని తెలుస్తోంది. జేడీయూ అభ్యర్థులు నిలుచున్న చోట ఆ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. అంతిమంగా పలు నియోజకవర్గాల్లో జేడీయూ గెలుపుపై ప్రభావం చూపింది.
బిహార్ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ జేడీయూ 122, భాజపా 121 స్థానాలు పంచుకున్నాయి. తనకు కేటాయించిన 122 సీట్లలోంచి ఏడు సీట్లను జితన్రాం మాంఝీ పార్టీ (హెచ్ఏఎం)కు ఇచ్చింది. భాజపా సైతం వికాశ్ శీల్ ఇన్షాల్ పార్టీ (వీఐపి)కి 13 స్థానాలు కేటాయించింది. జేడీయూ 115, భాజపా 110 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. సీట్ల పంపకానికి కొద్ది రోజుల ముందు నీతీశ్ను వ్యతిరేకిస్తూ చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చింది. అదే సమయంలో భాజపాతో తమ బంధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. జేడీయూ అభ్యర్థులు నిల్చున్న చోట అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తంగా 135 సీట్లలో పోటీ చేసింది. ఫలితాల్లో జేడీయూకు 15+ శాతం ఓట్లు రాగా.. భాజపాకు దాదాపు 19+ శాతం ఓట్లు వచ్చాయి. ఎల్జేపీ 5.7 శాతం ఓట్లు సాధించింది. ఒకవేళ చిరాగ్ ఎన్డీయేతో కలిసి పోటీ చేసి ఉంటే జేడీయూకు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు.
ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు రావడానికి చిరాగ్ చెప్పిన కారణలేవీ సహేతుకంగా అనిపించవు. నీతీశ్ అవినీతికి పాల్పడ్డారని, ఆయన బిహార్కు ఏమీ చేయలేదని విమర్శిస్తూ వచ్చారు. తమకు చెక్ పెట్టేందుకే (దళిత ఓట్ల చీలికకు) జితన్రాం మాంఝీని కూటమిలోకి తీసుకొచ్చారని నీతీశ్ను తప్పుబట్టారు. ఈ కారణాలతో స్వతంత్రంగా పోటీ చేశారు. కానీ ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్న భాజపాను ఆయన ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. దీంతో ఎల్జేపీని భాజపానే ఒంటరిగా పోటీ చేయించిందన్న ఆరోపణలు వచ్చాయి. జేడీయూ సీట్లను భారీగా చీల్చడం ద్వారా ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావించినట్లు తెలుస్తోంది. ఎల్జేపీ బయటకొచ్చిన తొలినాళ్లలో భాజపా సైతం చిరాగ్ను పెద్దగా విమర్శించిన దాఖల్లాలేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. అయితే ఈ వ్యూహం వల్ల మహాకూటమి బలపడే అవకాశం ఉందన్న అంచనాకొచ్చిన కాషాయ పార్టీ ఎల్జేపీతో తమకు ఎలాంటి బంధం లేదని కొన్నాళ్లకు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఓ పార్టీ అధికార పార్టీపై ఆరోపణలు చేయడం జేడీయూకు నష్టం చేసింది. అంతిమంగా ఆ పార్టీ సీట్లు కోసుకుపోయేలా చేసింది. చెరి సగం స్థానాల్లో భాజపా, జేడీయూ పోటీ చేయగా.. 75, 40 స్థానాల్లో (తుది ఫలితాలు మారొచ్చు) విజయం దిశగా దూసుకెళుతున్నాయి. దీంతో రెండు పార్టీల మధ్య అంతరం దాదాపు 25 సీట్ల వరకు ఉండడంతో నీతీశ్కు సీఎం పీఠం ఇచ్చే విషయంలో భాజపా వెనుకడుగు వేసే సూచనలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్