ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బంగారు రాష్ట్రం చేస్తాం
వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వానికి ఒక్క అవకాశం ఇస్తే ఐదేళ్లలో పశ్చిమ బెంగాల్ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హోంమంత్రి........
పశ్చిమ బెంగాల్ పర్యటనలో హోంమంత్రి అమిత్షా
కోల్కతా: వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వానికి ఒక్క అవకాశం ఇస్తే ఐదేళ్లలో పశ్చిమ బెంగాల్ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హోంమంత్రి, భాజపా సీనియర్ నేత అమిత్షా హామీ ఇచ్చారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగించుకున్న అనంతరం కోల్కతాలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీల అమలులో సీఎం మమతా బెనర్జీ విఫలమయ్యారని విమర్శించారు.
‘‘కాంగ్రెస్కు, కమ్యూనిస్టులకు, మమతా బెనర్జీకి ఇప్పటి వరకు అవకాశం ఇచ్చారు. ఈసారి నరేంద్రమోదీ నాయకత్వానికి అవకాశం ఇచ్చి చూడండి. ఐదేళ్లలో బంగారు రాష్ట్రంగా బెంగాల్ను తీర్చిదిద్దుతాం. రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం’’ అని షా అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తొలి ఐదేళ్లలోనే దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలకు మంచినీరు, గ్యాస్, విద్యుత్, మరుగుదొడ్ల సదుపాయం కల్పించామని చెప్పారు. 2010లో అధికారంలోకి వచ్చిన మమత బెంగాల్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు.
కొవిడ్, వరదల సమయంలోనూ తృణమూల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అమిత్ షా ఆరోపించారు. గతేడాది రాష్ట్రంలో 100 మంది భాజపా కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్పారు. కానీ, మమత బెనర్జీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ 200కు పైగా సీట్లతో భాజపా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. లోక్సభ ఎన్నికల్లో ఆదరించినట్లే మరోసారి ఆదరించాలని ఓటర్లను అభ్యర్థించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా