పీఎం కేర్స్కు చైనా నుంచి నిధులు అందాయా?
సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం పీఎం కేర్స్ నిధి సేకరణకు సంబంధించి పలు సందేహాలను లేవనెత్తారు.
కాంగ్రెస్ నేత చిదంబరం సూటి ప్రశ్న
దిల్లీ: కరోనా కట్టడి కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్ నిధులను జాతీయ విపత్తు నిర్వహణ నిధికి (ఎన్డీఆర్ఎఫ్) మళ్లించేలా ఆదేశించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ రెండూ వేర్వేరు లక్ష్యాలు కలిగిన వేర్వేరు నిధులని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం సుప్రీంకోర్టు తీర్పు అంతిమం అంటూనే.. పీఎం కేర్స్ నిధి సేకరణకు సంబంధించి పలు సందేహాలను లేవనెత్తారు. వాటిని ట్విటర్ మాధ్యమంలో తెలియజేశారు.
*పీఎంకేర్స్ నిధికి మార్చి 2020 మొదటి ఐదు రోజల్లో రూ.3076 కోట్ల విరాళం అందించిన దాతలెవరు?ఆ జాబితాలో చైనా సంస్థలు కూడా ఉన్నాయా?
*కొవిడ్-19 కార్యకలాపాలకు నిధి నుంచి డబ్బును కేటాయించే విధి విధానాలు ఏవి?
*లబ్దిదారుల నుంచి వినియోగ ధృవీకరణ పత్రాలను (యుటిలైజేషన్ సర్టిఫికెట్) తీసుకుంటున్నారా?
*ఈ నిధి సమాచార హక్కు పరిధి వెలుపల ఉన్నట్లయితే.. దీని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరు వెల్లడిస్తారు?
పీఎం కేర్స్ సంబంధించి పారదర్శకత, వివరాల వెల్లడి, నిర్వహణ పద్ధతి తదితర అంశాలు న్యాయస్థానం సమక్షానికి రాలేదని చిదంబరం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం ఈ నిధి చట్టబద్ధతను గురించి మాత్రమే తీర్పునిచ్చిందని... దీని గురించి చర్చలు కొనసాగుతూనే ఉంటాయని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!