రజనీ పొలిటికల్ ఎంట్రీపై పవన్ స్పందన
నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ డిమాండ్ చేశారు. వ్యవసాయం లాభసాటి కావాలనేదే
తుపాను బాధిత రైతులకు రూ.35వేలు చెల్లించాలన్న జనసేనాని
తిరుపతి: నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ డిమాండ్ చేశారు. వ్యవసాయం లాభసాటి కావాలనేదే జనసేన ఆలోచన అని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేల పరిహారం చెల్లించాలని పవన్ డిమాండ్ చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిహారం ఆలస్యం చేయడం మూలంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఇప్పటికే నలుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టంపై అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ నేతలు ప్రత్యక్షంగా పర్యటించి నివేదిక తయారు చేస్తామని.. దాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందిస్తామని వివరించారు. ఎప్పుడూ పంటనష్ట పరిహారం రైతులకు కొద్దోగొప్పో అందుతోందని.. కౌలు రైతులకు మాత్రం సంపూర్ణసాయం అందడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల మాదిరిగానే కౌలురైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.
రైతుల కోసం త్వరలోనే ‘జైకిసాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని పవన్ చెప్పారు. ఎకరాకు రూ.5వేలు, రూ.10వేలు ఇస్తే న్యాయం జరగదన్నారు. అధికంగా పింఛన్లు ఇచ్చేందుకు నిధులు ఉన్నప్పుడు రైతులకు రూ.35వేలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేంద్రం తీసుకొచ్చిన కిసాన్ బిల్లులో అభ్యంతరాలుంటే చెప్పాలని ప్రభుత్వం కోరుతోందన్నారు. ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై మీడియా ప్రతినిధులు పవన్ స్పందన కోరగా.. భారీగా అభిమాన బలం, బలమైన ఆలోచన ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. రజనీ ప్రత్యక్షంగా ఎప్పుడూ రాజకీయాల్లోకి రానప్పటికీ పరోక్షంగా ఆయన ప్రభావం ఉండేదని పవన్ చెప్పారు. తిరుపతి ఉపఎన్నికకు జనసేన, భాజపా ఉమ్మడి కమిటీ అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. ఈ విషయంలో ఎలా ముందుకెళ్తే బావుంటుందనేదానిపై చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్