మళ్లీ మహాకూటమి పంచకు నీతీశ్: చిరాగ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి పంచకు చేరడం ఖాయమని ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్........
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి పంచకు చేరడం ఖాయమని ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ అన్నారు. అంతేకాదు 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీకి పోటీగా ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలవాలని భావిస్తున్నారని చెప్పారు. ఎప్పటికైనా భాజపాకు తామే అత్యంత విశ్వాసపాత్రమైన పార్టీ అని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీతీశ్పై మరోసారి విమర్శలు గుప్పించారు.
లాలూ ప్రసాద్ పాలనను వ్యతిరేకిస్తూ తొలిసారి ఎన్డీయే భాగస్వామిగా నీతీశ్ అధికారంలోకి వచ్చారని చిరాగ్ గుర్తుచేశారు. కొన్నేళ్లకే భాజపాతో బంధాన్ని తెంచుకున్నారన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం లాలూతో కలిసి ఎన్నికల్లో గెలుపొందారని, రెండేళ్లకే ఆ బంధాన్ని తెంచుకుని మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరిన నీతీశ్ పచ్చి అవకాశవాది అని విమర్శించారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి మహాకూటమి పంచన చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చిరాగ్ జోస్యం చెప్పారు. ఈ విషయంలో తన మాటలను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం తానే అన్నట్లుగా నీతీశ్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటారని అన్నారు. తాము అధికారంలోకొస్తే నీతీశ్ అవినీతిని బయట పెడతానని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఎల్జేపీ 140 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. ఎక్కువ స్థానాల్లో జేడీయూ అభ్యర్థులపైనే పోటీకి ఉంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!