అలా మాట్లాడి ఓట్లడుగుతారా.. ఎంత ధైర్యం?
బిహార్లో తొలి విడత ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. భాజపా, కాంగ్రెస్ హేమాహేమీలు ప్రచారం రంగంలోకి దూకడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ...........
సస్రరాంలో విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్
ససరాం: బిహార్లో తొలి విడత ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. భాజపా, కాంగ్రెస్ హేమాహేమీలు ప్రచారం రంగంలోకి దూకడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ సస్రరాంలో తొలి బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం నితీశ్తో కలిసి తొలిసారి వేదికను పంచుకున్న మోదీ ఆర్టికల్ 370 రద్దు అంశంపై విపక్షాలను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు కోసం దేశంలో ప్రతి ఒక్కరూ ఎదురుచూశారని.. కానీ, అధికారంలోకి వస్తే మాత్రం దాన్ని తిరిగి పునరుద్ధరిస్తామంటూ విపక్ష నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామంటున్నారు. ఇలాంటి ప్రకటనలు చేసిన తర్వాత కూడా వాళ్లు బిహార్ నుంచి ఓట్లు అడిగే ధైర్యం సాహసం చేస్తున్నారు. ఇది బిహార్కు అవమానం కాదా? ఈ దేశ భద్రత కోసం బిహార్ తన పుత్రులు, పుత్రికలను సరిహద్దులకు పంపుతోంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తొలుత సీఎం నితీశ్ కుమార్ వ్యతిరేకించారు. జేడీయూ ఎంపీలు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అనంతరం కొద్ది రోజుల్లోనే ఇది చట్టరూపం దాల్చిన నేపథ్యంలో దానికి మద్దతు తెలుపుతున్నట్టు జేడీయూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా బిహార్లోని పలుచోట్ల ఎన్నికల ప్రసగంలో ఆర్టికల్ 370 రద్దు అంశాన్నే ప్రస్తావించారు. ఈ ఆర్టికల్ రద్దుతో ఇరత రాష్ట్రాల ప్రజలకు జమ్మూకశ్మీర్లో ఎక్కడైనా సొంత ఆస్తులు కలిగివుండే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల