బెంగాల్ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్పై రాళ్లు!
పశ్చిమబెంగాల్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్పై దాడి కలకలం రేపింది. అలీపుర్దువర్ జిల్లాలో జైగాన్ ప్రాంతంలో ఆయన కాన్వాయ్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి, నల్ల జెండాలతో నిరసన తెలిపినట్టు ..........
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్పై దాడి స్థానికంగా కలకలం రేపింది. అలీపుర్దువర్ జిల్లాలో జైగాన్ ప్రాంతంలో ఆయన కాన్వాయ్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి, నల్ల జెండాలతో నిరసన తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. గుర్ఖా జన్ముక్తి మోర్చ (జీజేఎం) కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి అక్కడినుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో దిలీప్ ఘోష్ వాహనం పాక్షికంగా ధ్వంసమైనట్టు భాజపా వర్గాలు తెలిపాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అనంతరం దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించే తృణమూల్ కాంగ్రెస్, మిత్రపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఏదైమైనా ఇలాంటి ఎత్తుగడలు పనిచేయవని.. ప్రజలు తమవెంటే ఉన్నారన్నారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తుందన్నారు. చాయ్పే చర్చా కార్యక్రమంలో పాల్గొని వేరే కార్యక్రమానికి వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. అయితే, దీనిపై ఆ జిల్లా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సౌరవ్ చక్రవర్తి స్పందించారు. నార్త్ బెంగాల్లో సమస్యలు సృష్టించేందుకు దిలీప్ ఘోస్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనతో తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా