విశాఖకు వైకాపా చేసిందేమీలేదు: అయ్యన్న

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేది లేదని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు.

Updated : 15 Nov 2020 11:48 IST

అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేది లేదని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రాజెక్టు విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేదుకు పోలవరం ఆ పార్టీ నేతల ఇంటి ప్రహరీ కాదని ఆక్షేపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను దోపిడీ చేస్తూ అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప విశాఖకు వైకాపా చేసిందేముంది? అని నిలదీశారు. ఉన్న పెట్టుబడులు తరిమేయడం తప్ప గొప్పగా విశాఖకు వైకాపా చేసిందేమీ లేదని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో విధ్వంసం ప్రారంభమైందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని