Gujarat: ఆమ్ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా అరెస్ట్
ఓ వీడియోకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన ఆమ్ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియాను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు (Gujarat Elections) గడువు సమీపిస్తోన్న వేళ.. భాజపా, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియాను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం అక్కడి రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ (NCW) ముందు గోపాల్ ఇటాలియా హాజరయ్యారు. విచారణ జరుగుతోన్న సమయంలో ఎన్సీడబ్ల్యూ కార్యాలయానికి చేరుకున్న ఆప్ కార్యకర్తలు.. ఆందోళన చేపట్టారు. దీంతో ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు ఇటాలియాను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై గోపాల్ ఇటాలియా అభ్యంతరకర పదాలు వాడారని భాజపా ఆరోపించింది. అందుకు సంబంధించిన ఓ పాత వీడియోను భాజపా ఐటీ సెల్ ఇంఛార్జ్ అమిత్ మాల్వీయ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. వివరణ ఇవ్వాలంటూ గోపాల్ ఇటాలియాకు సమన్లు జారీ చేసింది. ‘ప్రధానమంత్రితోపాటు మహిళలపై అభ్యంతరకర భాషను వాడటం అవమానకరం. మీరు వాడిన భాష.. లింగ పక్షపాతం, స్త్రీ ద్వేషంతో కూడుకున్నవి, ఇవి మీకు తగదు. దీనిపై వివరణ ఇవ్వాలి’ అని పేర్కొంటూ గోపాల్ ఇటాలియాకు అక్టోబర్ 9న ఎన్సీడబ్ల్యూ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ ముందు హాజరైన అతడిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మండిపడ్డ ఆమ్ఆద్మీ పార్టీ
గోపాల్ ఇటాలియాను అదుపులోకి తీసుకోవడంపై ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన ఆరెస్టు ద్వారా గుజరాత్లో పటేల్ వర్గం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘గోపాల్ ఇటాలియా సర్దార్ పటేల్ వారసుడు. మీ జైలుకు భయపడరు’ అంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!