Japan: ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
వివాహ బంధంలో కొత్త ట్రెండ్ను ఫాలో అవుతోన్న జపాన్ యువత.. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ధోరణి వైపు అడుగులు వేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ (Japan) యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మూడు పదుల వయసు వారిలో 75 శాతం మంది వివాహమే తమ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు అక్కడి సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో జపాన్ యువత కొత్త ట్రెండ్ను ఫాలో అవుతోందట. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ధోరణి వైపు అడుగులు వేస్తోందని వెల్లడైంది.
ఏమిటీ మ్యారేజ్?
ప్రేమ లేదా లైంగిక సంబంధానికి తావు లేకుండా ఉండేదే ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ (Friendship Marriage). భాగస్వామి పరస్పర ఆసక్తులు, విలువల ఆధారంగా వారితో కలిసి జీవించడం అన్నమాట. వీళ్లు చట్టపరంగా దంపతులే అయినప్పటికీ.. ప్రేమ, శృంగారానికి దూరంగా ఉంటారట. కొందరు కలిసి జీవిస్తే.. మరికొందరు వేర్వేరుగా ఉంటారు. పిల్లలు కావాలనుకుంటే.. కృత్రిమ గర్భధారణ విధానాల ద్వారా ప్రయత్నిస్తారు. పరస్పర అంగీకారం ఉన్నంతకాలం తమకు నచ్చిన వారితో ఇరువురూ స్వేచ్ఛగా ఉండొచ్చు.
వాటిపై ఆసక్తి లేనివారు..
సంప్రదాయ వివాహ బంధంపై ఆసక్తి లేనివారు ఈ తరహా బంధంవైపు అడుగులు వేస్తున్నారని కొలొరస్ అనే జపాన్ సంస్థ నివేదించింది. 2015లో ఏర్పాటైన ఈ సంస్థ.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 500 మంది ఇటువంటి బంధంతో ఒక్కటయ్యారని, వారిలో కొందరు పిల్లల్ని కూడా పెంచుకున్నారని తెలిపింది. మొత్తం 12 కోట్లకుపైగా జనాభా ఉన్న జపాన్లో ఇలాంటి వారు దాదాపు ఒకశాతం మంది ఉండవచ్చని లెక్కకట్టింది. అంటే ఇలాంటి వారు దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది ఉన్నట్లు అంచనా.
జనాభా ఇలాగే తగ్గిపోతే.. జపాన్ మాయం...!
ఈ స్నేహ వివాహం పట్ల ఆసక్తి చూపుతున్నవారి సరాసరి వయసు 32 ఏళ్లుగా ఉందని కొలొరస్ ఏజెన్సీ పేర్కొంది. వీరిలో 85 శాతం మంది డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసించిన వారే ఉంటున్నారని తెలిపింది. సంప్రదాయ వైవాహిక బంధాలు, ప్రేమపై ఆసక్తి లేనివారు ఇటువంటి సాంగత్యాన్ని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువత ఈ తరహా బంధాన్ని ఎంచుకుంటున్నారనే వాదన ఉంది. పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను కూడా వీరు పొందుతున్నారు.
ఎలా జీవిస్తారు..?
పెళ్లికి ముందే ఒకరికొకరు పరిచయం పెంచుకుంటారు. ఆహారపు అలవాట్లు, ఇల్లు, దుస్తుల శుభ్రత, ఇతర ఖర్చులను ఎలా పంచుకోవాలనే విషయాలపైనా ఏకాభిప్రాయానికి వస్తారు. ఎటువంటి శృంగార సంబంధ అంశాలు లేనప్పటికీ దీన్ని ఎంచుకునే వారిలో 80 శాతం జంటలు సంతోషంగా ఉన్నట్లు కొలొరస్ పేర్కొంది.
‘ఎవరో ఒకరికి గర్ల్ఫ్రెండ్గా ఉండటం నాకు నచ్చదు. కానీ, ఓ మంచి మిత్రురాలిగా ఉండగలను. నాలాంటి అభిరుచులు కలిగిన వ్యక్తితో జీవితాన్ని సరదాగా గడపపాలని కోరుకుంటున్నా’ అని ఓ అమ్మాయి వివరించింది. ‘ఒకే అభిరుచులు కలిగిన ఓ రూమ్మేట్తో ఉన్నట్లే ఉంటుంది. మేం మూడేళ్ల అంగీకారం కుదుర్చుకున్నాం’ అని ఓ వ్యక్తి చెప్పారు. ఇదిలాఉంటే, ఈ తరహా ట్రెండ్పై జపాన్ యువత ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. వీటివల్ల విడాకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఐఆర్ఎన్ఏ పేర్కొంది. అక్కడి సహాయక బృందాలను పంపినట్లు వెల్లడించింది. -
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. -
విషమంగానే స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్యం
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. -
అఫ్గాన్లో కొనసాగుతున్న కుండపోత వర్షాలు
అధిక వర్షాలు అఫ్గానిస్థాన్ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. -
ఆ ఘటనతోనే భారత్తో వాణిజ్య బంధానికి తెర : పాక్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ అన్నారు. -
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు
రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దీనివల్ల పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంలోకి వచ్చిన 57 డ్రోన్లు, పలు క్షిపణులను కూల్చేశామని రష్యా ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు