ఎడప్పాడి నుంచి పళని.. మరి పన్నీర్?
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాజకీయ దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత మరణానంతరం తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా .....
ఆరుగురితో అన్నాడీఎంకే తొలి జాబితా విడుదల
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాజకీయ దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత మరణానంతరం తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నాడీఎంకే, డీఎంకే పట్టుదలతో ఉన్నాయి. అధికార అన్నాడీఎంకే ఈసారి భాజపాతో కలిసి బరిలో దిగుతుండగా.. కాంగ్రెస్, వామపక్షాలతో జతకట్టి డీఎంకే ఎన్నికల సంగ్రామంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి అన్నాడీఎంకే ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పేర్లు ఉన్నాయి. ఇద్దరూ తమ సొంత నియోజకవర్గాల నుంచే బరిలో నిలుస్తున్నారు. పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతుండగా.. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం బోడినయకనూరు నుంచి పోటీలో ఉన్నారు. 2011 నుంచి ఇద్దరూ ఇవే నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.
వీరితో పాటు ఈ జాబితాలో మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్ (రొయపురం నియోజకవర్గం), న్యాయశాఖ మంత్రి షణ్ముగం (విజుపురం), ఎమ్మెల్యేలు ఎస్పీ షన్ముగనంతన్ (శ్రీవైగుండం), ఎస్.తెన్మోజి (నిలకొట్టాయ్)లకు స్థానం దక్కింది. మరోవైపు, అన్నాడీఎంకే, మిత్రపక్షాల మధ్య సీట్ల కేటాయింపులు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. భాజపా 25 నుంచి 30 స్థానాలు కోరుతున్నప్పటికీ అన్నాడీఎంకే మాత్రం 20 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, విజయ్కాంత్కు చెందిన డీఎండీకే 20 స్థానాలు కావాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎన్నిసీట్లు కేటాయిస్తారో చూడాలి.
తమిళనాడులోని 38 జిల్లాల పరిధిలో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు