
Akhilesh Yadav: ప్రతిపక్ష నేతగా అఖిలేశ్ యాదవ్.. బాబాయి శివపాల్ అలక
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీలో మరోసారి విభేదాలు తలెత్తాయా..? అబ్బాయి అఖిలేశ్ యాదవ్.. బాబాయి శివపాల్ యాదవ్ మధ్య సంబంధాలు మళ్లీ చెడిపోయాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా సమాజ్వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎన్నికయ్యారు. అయితే ఈ సమావేశానికి శివపాల్ యాదవ్ను ఆహ్వానించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సమాజ్వాదీ పార్టీ నుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం లఖ్నవూలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీలోనే పార్టీ శాసనసభాపక్ష నేతగా అఖిలేశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ తెలిపారు. అయితే ఈ సమావేశానికి అఖిలేశ్ బాబాయి, ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ శివపాల్ యాదవ్కు ఆహ్వానం అందలేదట. దీనిపై ఆయన బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పార్టీ సమావేశానికి నన్ను ఆహ్వానించలేదు. ఈ భేటీ కోసం నేను రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. నా కార్యక్రమాలను కూదా రద్దు చేసుకున్నా. నేను సమాజ్వాదీ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నన్ను పిలవలేదు’’ అని శివపాల్ అసహనం చెందారు.
అఖిలేశ్, శివపాల్ మధ్య 2016లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. శివపాల్ను అఖిలేశ్ తన కేబినెట్ నుంచి తప్పించడం.. ఆ తర్వాత శివపాల్ పార్టీ నుంచి విడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ ఎన్నికల్లో శివపాల్ సొంతంగా పోటీ చేశారు. అయితే ఇటీవల 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిద్దరూ పాత విభేదాలను పక్కనబెట్టి చేతులు కలిపారు. శివపాల్ తన పార్టీని ఎస్పీలో కలుపుతున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ శివపాల్ ఎస్పీ గుర్తుపైనే పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కూటమి 125 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు చాలా దూరంలో ఆగిపోయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు సీట్లు గెలుచుకోవడం గమనార్హం. అఖిలేశ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. కర్హాల్ నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. అయితే అంతకుముందే ఆజంగఢ్ ఎంపీగా ఉన్న ఆయన.. ఇటీవల తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఈ త్యాగం తప్పట్లేదంటూ అఖిలేశ్ ట్విటర్లో రాసుకొచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: తెలంగాణలో భాజపాకు బిగ్ షాక్... తెరాసలో చేరిన కార్పొరేటర్లు
-
Sports News
Ind vs Eng: టీమ్ఇండియా కెప్టెన్గా బుమ్రా... తుదిజట్టు ప్రకటించిన ఇంగ్లాండ్
-
Movies News
Social Look: రెజీనా ‘లైఫ్’ క్యాప్షన్.. కట్టిపడేసేలా జాక్వెలిన్ ‘రెడ్’లుక్!
-
Business News
Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
-
General News
PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం
-
World News
Israel: ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దు.. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ శిందే.. నేడే ప్రమాణం
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?