Akhilesh Yadav: ప్రతిపక్ష నేతగా అఖిలేశ్ యాదవ్.. బాబాయి శివపాల్ అలక
సమాజ్వాదీ పార్టీలో మరోసారి విబేధాలు తలెత్తాయా..? అబ్బాయి అఖిలేశ్ యాదవ్.. బాబాయి శివపాల్ యాదవ్ మధ్య సంబంధాలు మళ్లీ చెడిపోయాయా? ప్రస్తుత పరిణమాలు
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీలో మరోసారి విభేదాలు తలెత్తాయా..? అబ్బాయి అఖిలేశ్ యాదవ్.. బాబాయి శివపాల్ యాదవ్ మధ్య సంబంధాలు మళ్లీ చెడిపోయాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా సమాజ్వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎన్నికయ్యారు. అయితే ఈ సమావేశానికి శివపాల్ యాదవ్ను ఆహ్వానించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సమాజ్వాదీ పార్టీ నుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం లఖ్నవూలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీలోనే పార్టీ శాసనసభాపక్ష నేతగా అఖిలేశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ తెలిపారు. అయితే ఈ సమావేశానికి అఖిలేశ్ బాబాయి, ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ శివపాల్ యాదవ్కు ఆహ్వానం అందలేదట. దీనిపై ఆయన బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పార్టీ సమావేశానికి నన్ను ఆహ్వానించలేదు. ఈ భేటీ కోసం నేను రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. నా కార్యక్రమాలను కూదా రద్దు చేసుకున్నా. నేను సమాజ్వాదీ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నన్ను పిలవలేదు’’ అని శివపాల్ అసహనం చెందారు.
అఖిలేశ్, శివపాల్ మధ్య 2016లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. శివపాల్ను అఖిలేశ్ తన కేబినెట్ నుంచి తప్పించడం.. ఆ తర్వాత శివపాల్ పార్టీ నుంచి విడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ ఎన్నికల్లో శివపాల్ సొంతంగా పోటీ చేశారు. అయితే ఇటీవల 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిద్దరూ పాత విభేదాలను పక్కనబెట్టి చేతులు కలిపారు. శివపాల్ తన పార్టీని ఎస్పీలో కలుపుతున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ శివపాల్ ఎస్పీ గుర్తుపైనే పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కూటమి 125 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు చాలా దూరంలో ఆగిపోయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు సీట్లు గెలుచుకోవడం గమనార్హం. అఖిలేశ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. కర్హాల్ నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. అయితే అంతకుముందే ఆజంగఢ్ ఎంపీగా ఉన్న ఆయన.. ఇటీవల తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఈ త్యాగం తప్పట్లేదంటూ అఖిలేశ్ ట్విటర్లో రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!