ప్రశాంత్‌ కిషోర్‌ తప్పు తెలుసుకొని బాధపడుతున్నారు: ఆనం వెంకటరమణారెడ్డి

వైయస్‌ఆర్‌ సీఎం కాకముందు ఆయన కుమారుడు జగన్‌ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkat Ramana Reddy) విమర్శించారు.

Published : 24 Dec 2023 15:03 IST

నెల్లూరు: వైయస్‌ఆర్‌ సీఎం కాకముందు ఆయన కుమారుడు జగన్‌ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkat Ramana Reddy) విమర్శించారు. వైయస్‌ఆర్‌ సీఎం అయ్యాకే జగన్‌ ఎదిగారని చెప్పారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడారు. మనమంతా జగన్‌, షర్మిలకు వైయస్‌ఆర్‌ అంటే ఎంతో ప్రేమ అనుకుంటాం.. కానీ, రాజశేఖర్‌ రెడ్డి చనిపోయాక ఆయన కోసం వైఎస్‌ కుటుంబం ఏం చేసింది?అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో వైకాపా కోసం పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తప్పు తెలుసుకొని.. ఏపీ సర్వనాశనమైందని బాధపడుతున్నారని ఆనం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని