MP Avinash: సీబీఐ అధికారులకు ఎంపీ అవినాష్రెడ్డి మరో లేఖ
ఎంపీ అవినాష్రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అవినాష్ను సీబీఐ అరెస్టు చేస్తుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో అవినాష్ మరోసారి సీబీఐ అధికారులకు లేఖ రాశారు.
కర్నూలు: ఎంపీ అవినాష్రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అవినాష్ను సీబీఐ అరెస్టు చేస్తుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన మరోసారి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నెల 27వ తేదీ వరకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ అధికారులను లేఖలో విజ్ఞప్తి చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
రెండో సారి ఎస్పీని కలిసిన సీబీఐ అధికారులు
అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో కర్నూలు ఎస్పీని సీబీఐ అధికారులు మరోసారి కలిశారు. సీబీఐ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అవినాష్ అరెస్టుపై ఎస్పీ కృష్ణకాంత్ స్పష్టత ఇవ్వడం లేదు. డీజీపీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నట్లు సమాచారం.
సెంట్రల్ ఫోర్స్ సాయంతో అవినాష్ అరెస్టు?
సీబీఐ అధికారులు ఐదుగురు సభ్యులు మూడు వాహనాల్లో కర్నూలుకు చేరుకొని పోలీస్ గెస్ట్ హౌస్లో ఉన్నారు. మరో వైపు విశ్వభారతి ఆసుపత్రి వద్ద వైకాపా కార్యకర్తలు బైఠాయించారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు బారిగేట్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రిస్తున్నారు. సెంట్రల్ ఫోర్స్ సాయంతో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్