Bandi Sanjay: కేసీఆర్.. తెలంగాణ డబ్బులు పంజాబ్లో పంచి పెడతారా?: బండి సంజయ్
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ నుంచి ఐదో రోజు ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర
భూదాన్ పోచంపల్లి: ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ నుంచి ఐదో రోజు ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర చింతబావి, రేవణపల్లి, భూదాన్ పోచంపల్లి పట్టణం మీదుగా సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ, మహిళలు, చిన్నారులను పలకరిస్తూ యాత్ర కొనసాగించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా పోచంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 360మంది చేనేత కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శంచారు. పంజాబ్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే 700 మందికి నష్టపరిహారం పేరుతో ఇక్కడి నిధులు అక్కడ ఇచ్చారని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తాం, చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తాం, ఇళ్లులేని అర్హులైన కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇస్తాం అని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా కేసీఆర్ దాన్ని కూడా విమర్శిస్తున్నారన్నారు. చేనేత కార్మికులు, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగాల విషయంలో కేసీఆర్ ముందే స్పందించి ఉంటే ఆత్మహత్యలు ఉండేవి కావన్నారు. పోచంపల్లి మండలానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్