ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్‌

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్‌ వేశారు.

Published : 05 May 2024 06:18 IST

ఈనాడు, నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. నేషనల్‌ నవక్రాంతి పార్టీ నుంచి, స్వతంత్ర అభ్యర్థిగా కర్నె రవి రెండు నామినేషన్లను దాఖలు చేయగా.. స్వతంత్ర అభ్యర్థులుగా భైరవబొట్ల శ్రీనివాసరావు, దైద సోమసుందరం, బక్క జడ్సన్‌లు తమ నామినేషన్లను అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి మహేందర్‌కు అందజేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్‌ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. సోమవారం భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని