Nara Bhuvaneswari: తెదేపా కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ.. రూ.3లక్షల చెక్కు అందజేత

విజయనగరంలో తెదేపా కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించారు.

Updated : 03 Jan 2024 17:54 IST

విజయనగరం: విజయనగరంలో తెదేపా కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక అప్పారావు గుండెపోటుతో గతేడాది సెప్టెంబరు 10న మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని బుధవారం నారా భువనేశ్వరి పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య పద్మావతి, కుమారుడు జయంత్‌సాయితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కును అందించి.. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని