West Bengal: సొంతగూటికి సువేందు అధికారి..? తృణమూల్ నేత కీలక వ్యాఖ్యలు!
గతేడాది పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. దానికి కారణం.. సువేందు అధికారి అని చెప్పొచ్చు. అప్పటికే అధికారంలో తృణమూల్ పార్టీలో మంత్రిగా, అగ్ర నాయకుడిగా కొనసాగిన సువేందు అధికారి.. ఎన్నికల ముందు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కషాయం పార్టీకి
కోల్కతా: గతేడాది పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. దానికి కారణం.. సువేందు అధికారి. అప్పటికే అధికారంలో తృణమూల్ పార్టీలో అగ్ర నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా కొనసాగిన సువేందు అధికారి.. ఎన్నికల ముందు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాషాయం పార్టీకి బలం పెరిగి.. టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ, మమతా బెనర్జీ పార్టీనే మరోసారి అధికారంలోకి రావడంతో సువేందు అధికారి ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. కాగా.. ఇప్పుడాయన తిరిగి సొంత గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నట్లు టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ వెల్లడించారు.
‘‘భాజపాలో సువేందు అధికారి ఇమడలేకపోతున్నట్లు మాకు తెలిసింది. కాంటేయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. ఆ జాబితాలో సువేందు అధికారి తన సోదరుడు సౌమేందు అధికారి పేరును సూచించినా భాజపా పట్టించుకోలేదు. ఇది వరకు కాంటేయ్ మున్సిపాలిటీ చైర్మన్గా సౌమేందు పనిచేశారు. దీంతో అతడి పేరును ప్రకటించాలని డిమాండ్ చేసినా భాజపా పెడచెవిన పెట్టింది. ఆ పార్టీ తీరుతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కాంటేయ్, కాంతి ప్రాంతాలు సువేందు కుటుంబానికి కంచుకోటలా ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆ కుటుంబం ఆ ప్రాంతాలపై పట్టు కోల్పోయింది. అందుకే, సువేందు మళ్లీ మా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది’’ అని కునాల్ ఘోష్ తెలిపారు. సంప్రదింపులపై పూర్తి వివరాలేవి చెప్పలేనని, ఈ విషయంలో పార్టీ అధినేత్రే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్