అసోం ఎన్నికలు.. భాజపా మేనిఫెస్టో విడుదల!
అసోం శాసనసభ ఎన్నికలకు అధికార భాజపా మేనిఫెస్టో ప్రకటించింది. గువహటిలో మంగళవారం‘సంకల్ప్ పాత్ర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు.
గువహటి: అసోం శాసనసభ ఎన్నికలకు అధికార భాజపా మేనిఫెస్టో ప్రకటించింది. గువహటిలో మంగళవారం ‘సంకల్ప్ పాత్ర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నడ్డాతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం సర్బానంద సోనోవాల్ నాయకుల నేతృత్వంలో అసోం అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. భాజపా మేనిఫెస్టోలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూడిన అంశాలను పొందుపరిచింది.
మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన హామీలు
• బ్రహ్మపుత్ర నది నీటిని నిల్వ చేసుకుని వినియోగించుకునేందుకు నదిపై పలు రిజర్వాయర్లు నిర్మాణం.
• అర్హులైన 30లక్షల కుటుంబాలకు అరుణోదయ పథకం కింద నెలకు రూ.3వేల ఆర్థిక సాయం.
• ప్రభుత్వ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి. 2022 మార్చి 31లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ. అంతేకాకుండా ప్రైవేటు రంగంలో 8లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి.
• అసోం భద్రత కోసం సవరణలతో కూడిన ఎన్ఆర్సీపై పనిచేసి.. అక్రమ చొరబాటుదార్లను కనుగొనడం ద్వారా నిజమైన భారతీయ పౌరులకు రక్షణ.
• మిషన్ శిశు ఉన్నయన్ పథకం కింద బాలలకు నాణ్యమైన విద్య. ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ.
• భారతీయ పౌరులందరికీ భూ హక్కులు కల్పించడంతో పాటు విద్య, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్యం, మహిళా సాధికారతకు పలు కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ