గుజరాత్ ఎన్నికల కోసమే ఆ అస్త్రం ప్రయోగిస్తున్నారు: భాజపాపై మమత ఫైర్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly polls)ను దృష్టిలో ఉంచుకొని భాజపా పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక (NRC)లను ఉయోగిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శించారు.
కృష్ణానగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly polls)ను దృష్టిలో ఉంచుకొని భాజపా పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక (NRC)లను ఉయోగిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శించారు. బెంగాల్లో సీఏఏని ఎప్పటికీ అమలు జరగనివ్వబోమని మరోసారి ఆమె స్పష్టంచేశారు. బెంగాల్ను ఎప్పటికీ ముక్కలు కానివ్వబోమని తేల్చి చెప్పారు. గురువారం కృష్ణానగర్లో నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో దీదీ మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారీ భాజపా సీఏఏ, ఎన్ఆర్సీ అంశాలపై మాట్లాడుతుంటుందని.. డిసెంబర్లో గుజరాత్ ఎన్నికలు, మరో ఏడాదిన్నరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో సీఏఏ అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని మమత మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాల్లో నివసించే రాజ్బన్షీలు, గూర్ఖాలను రెచ్చగొట్టడం ద్వారా వేర్పాటువాదాన్ని భాజపా ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. 2024 జరగబోయే లోక్సభ ఎన్నికల్లో భాజపా తిరిగి అధికారంలోకి రాదని దీదీ పునరుద్ఘాటించారు. 2019లో రాజకీయ పరిస్థితులు వేరేగా ఉండేవని.. అప్పటినుంచి మారుతూ వస్తున్నాయన్నారు. బిహార్, ఝార్ఖండ్తో పాటు పలు రాష్ట్రాల్లో అప్పుడు భాజపా అధికారంలో ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఉనికి తగ్గుతోందని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో భాజపా ప్రభావం తగ్గిపోతుండటం వల్లే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీలపై దాడులకు దిగడం, ప్రతిపక్ష నేతలను దూషిస్తూ అరెస్టులు చేయించడం వంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు