BRS: దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టులో భారాస పిటిషన్‌

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌ వ్యవహారంలో భారాస హైకోర్టును ఆశ్రయించింది. 

Published : 10 Apr 2024 20:11 IST

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌ వ్యవహారంలో భారాస హైకోర్టును ఆశ్రయించింది. భారాస తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ విషయంపై సభాపతి గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా కూడా దానం పేరును కాంగ్రెస్‌ ప్రకటించిందని, ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకునేలా సభాపతిని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని