KTR: అవినీతిపరులకు భాజపా కేరాఫ్‌గా మారింది: కేటీఆర్‌

భారతీయ జనతా పార్టీ అవినీతిపరులకు కేరాఫ్‌గా మారిందని తెలంగాణ మాజీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎక్స్‌లో ఆయన ఈ విధంగా స్పందించారు.

Published : 30 Apr 2024 23:38 IST

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ అవినీతిపరులకు కేరాఫ్‌గా మారిందని తెలంగాణ మాజీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎక్స్‌లో ఆయన ఈ విధంగా స్పందించారు. ఛోటా భాయ్‌ డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని మోదీ అన్నారని గుర్తు చేశారు. అక్రమంగా డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ఛోటా భాయ్‌ నిర్వాకాన్ని మోదీ ఎందుకు క్షమిస్తున్నారని కేటీఆర్‌ నిలదీశారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌కు సహకరిస్తామని ఛోటా భాయ్‌ని వదిలేస్తున్నారా?కాళేశ్వరంపై బడే భాయ్‌, ఛోటా భాయ్‌ది ఒకే మాట.. ఒకే బాట అని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. పదేళ్లయినా రాష్ట్రానికి దక్కాల్సిన విభజన హక్కులు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులపై కక్షగట్టి కేసులు పెడుతున్నారని, అంతే కాకుండా ఆధారాలు లేకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని కేటీఆర్‌ వాపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని