BJP: భాజపాలో చేరిన పలువురు భారాస నేతలు

సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు భారాస సీనియర్‌నేతలు భాజపా గూటికి చేరారు.

Updated : 10 Mar 2024 20:15 IST

దిల్లీ: తెలంగాణలో భారాసకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు సీనియర్‌ నేతలు భాజపా గూటికి చేరారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌నగర్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు.. దిల్లీలో తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని