రాజధానిపై తప్పు సరిదిద్దుకున్నారు: చంద్రబాబు
కేంద్ర హోంశాఖకు చెందిన సీపీఐఓ డైరెక్టర్ రేణు సరిన్.. అమరావతి బదులుగా ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఉన్నాయని సమాచార హక్కు చట్టంకింద చేసిన దరఖాస్తుకు తప్పుగా ఇచ్చిన సమాధానం సరిచేసుకోవటం హర్షణీయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర..
అమరావతి: కేంద్ర హోంశాఖకు చెందిన సీపీఐఓ డైరెక్టర్ రేణు సరిన్.. అమరావతి బదులుగా ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఉన్నాయని సమాచార హక్కు చట్టంకింద చేసిన దరఖాస్తుకు తప్పుగా ఇచ్చిన సమాధానం సరిచేసుకోవటం హర్షణీయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారిని తప్పుదారి పట్టించి, వాస్తవాలు తారుమారు చేశారని స్పష్టమవుతోందన్నారు. సంబంధిత అధికారులతో సమస్యను పరిష్కరించి, తప్పును సరిచేయించిన జీవీఆర్ శాస్త్రిని అభినందిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
ఏం జరిగిందంటే?
3రాజధానుల అంశంపై చైతన్యకుమార్రెడ్డి అనే వ్యక్తి గతంలో కేంద్ర హోంశాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్ ఈ నెల 6న సమాధానమిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020 ప్రకారం రాష్ట్రంలో 3పరిపాలన కేంద్రాలుంటాయి. వాటిని రాజధానులు అంటారు. రాష్ట్ర రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుంది’ అని అందులో పేర్కొన్నారు. ఈ సమాధానంపై అమరావతి జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ జి.వి.ఆర్.శాస్త్రి అభ్యంతరం చెబుతూ కేంద్ర హోంశాఖ అప్పిలేట్ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్కు ఈనెల 9న లేఖ రాశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రం తరఫున సీపీఐవో తప్పుడు సమాచారమిచ్చారని పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు. లేఖతో స్పందించిన కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్ రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉందంటూ తాను గతంలో ఇచ్చిన సమాధానానికి భిన్నంగా బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్