ఆ పార్టీకి మరోపేరే మోసం: నడ్డా
అసోంలో మరోసారి ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భాజపా జాతీయాధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గువహటిలో విలేకరులతో మాట్లాడారు.
గువహటి: అసోంలో మరోసారి ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భాజపా జాతీయాధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గువహటిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్కు ప్రజాసేవ చేయడం తెలియదని.. ఆ పార్టీకి మరోపేరే మోసం చేయడం అని నడ్డా విమర్శించారు.
‘గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కూడా టీ తోట కార్మికుల కోసం ఒక్క మంచి పనీ చేయలేదు. వారు ఇక్కడ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజకీయ పర్యాటకం కోసం మాత్రమే రాష్ట్రాన్ని వినియోగించుకున్నారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అసోంకు కనీసం పది సార్లు కూడా రాలేదు. కానీ, నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రానికి 35 సార్లు వచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఆరు వైద్య కళాశాలలు మంజూరు చేశాం. అసోం సంస్కృతి రక్షణ, భద్రత, అభివృద్ధి ఈ మూడు అంశాలే ప్రధాన అజెండాగా మేం ఎన్నికల్లో పోరాడుతున్నాం. సంస్కృతి పరిరక్షణ విషయానికి వస్తే గతంలో వాజ్పేయీ హయాంలో గోపినాథ్ బోర్డోలోయికి, ఇప్పుడు మోదీ హయాంలో భూపేన్ హజారికాకు భారతరత్న పురస్కారాలతో సత్కరించాం’ అని నడ్డా గుర్తు చేశారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే!
పశ్చిమబెంగాల్ సీఎం మమతా నందిగ్రామ్లో ఓడిపోబోతున్నారని నడ్డా అన్నారు. అందుకే ఆమె మరో స్థానంలో పోటీ చేయడం కోసం వెతుకుతున్నారని.. ఈ విషయాన్ని దీదీ మనుషులే తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ‘పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని తరిమేందుకు ప్రజలు ఆత్రుతగా ఉన్నారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే. బెంగాల్ ఫలితాలు వారికి దిమ్మతిరిగేలా చేస్తాయి. నందిగ్రామ్లోనూ దీదీకి ఓటమి తప్పదు. అందుకే ఆమె ఇంకో స్థానంలో పోటీ చేసేందుకు వెతుకుతున్నారని నాకు తెలిసింది’ అని నడ్డా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?