JP Nadda: కాంగ్రెస్కు ప్రతిపక్షంగా ఉండే అర్హత లేదు: జేపీ నడ్డా
విపక్ష పార్టీల్లోని నేతల వ్యక్తిగత లబ్ధి కోసం, వారి అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే ‘ఇండియా’ కూటమి ఏర్పడిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.
గువాహటి: కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రతిపక్షంగా ఉండే అర్హత లేదని భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) విమర్శించారు. బుధవారం అస్సాం రాజధాని గువాహటిలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాల్దీవుల వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు.
‘‘కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేదు. ప్రతిపక్షంగా ఉండే అర్హతను కూడా ఆ పార్టీ కోల్పోయింది. విపక్ష పార్టీలకు చెందిన నాయకుల వ్యక్తిగత లబ్ధి కోసం, వారి అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే ‘ఇండియా’ కూటమి ఏర్పడింది. ఆ కూటమి నేతల్లో చాలా మందిపై సీబీఐ కేసులు ఉన్నాయి. ఆ కూటమికి, ఇండియా (దేశాన్ని ఉద్దేశించి)కు సంబంధం లేదు’’ అని నడ్డా విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రకు బదులుగా రాహుల్ గాంధీ.. భారత్ తోడో అన్యాయ్ యాత్ర చేపట్టాలని ఆయన సూచించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ దేశానికి తీరని అన్యాయం చేసింది. భారత్ను అన్ని విధాలుగా విభజించింది. ప్రస్తుతం న్యాయం కావాలంటూ యాత్ర చేస్తున్నారు. వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ